నేర వార్తలు
నవ మాసాలు మోసిన తల్లే.. రెండు నెలల చిన్నారి ప్రాణం తీసింది. బాలుడి అనారోగ్యమే ఆ మాతృమూర్తిని హంతకురాలిని చేసింది. గురువారం పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు.
కొడుకు హత్య కేసులో.. తల్లి కటకటాలపాలు
ఉప్పల్, న్యూస్టుడే: నవ మాసాలు మోసిన తల్లే.. రెండు నెలల చిన్నారి ప్రాణం తీసింది. బాలుడి అనారోగ్యమే ఆ మాతృమూర్తిని హంతకురాలిని చేసింది. గురువారం పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్లో ఉండే మోహ్సిన్, సనాబేగం దంపతులకు రెండు నెలల కుమారుడు అబ్దుల్ రెహమాన్ ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ఈ పరిస్థితి చూడలేని సనాబేగం ఈ నెల 19 అర్ధరాత్రి చిన్నారిని నీటి సంపులో పడేసింది. కనిపించడంలేదంటూ కుటుంబ సభ్యులకు చెప్పింది. సంపులో గుర్తించి బాలుడిని ఆస్పత్రికి తరలించగా 20న చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
గౌతంనగర్, న్యూస్టుడే: ప్రేమలో విఫలమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి పరిధిలోని ఎంజే కాలనీలో నివసించే జహంగీర్(20) ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థల కారణంగా ఇటీవల విడిపోయారు. అప్పటి నుంచి మనస్తాపంతో పనికి వెళ్లకుండా ఒంటరిగా ఉంటున్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి వెళ్లిపోయాడని కుమార్తె బలవన్మరణం
గౌతంనగర్, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలి డివిజన్ ఆర్టీసీ కాలనీలో నివసించే దంపతులకు ఒక కుమార్తె(19), కుమారుడు ఉన్నారు. కుమార్తె ఈసీఐఎల్లో డిగ్రీ చదువుతోంది. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల కిందట భర్త ఇంట్లోంచి వెళ్లిపోయి వేరుగా ఉంటున్నాడు. తండ్రి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన కూతురు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తమ్మీ.. అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో!
పురుగు మందు తాగి తనువు చాలించిన యువకుడు
మేడ్చల్, న్యూస్టుడే: పెళ్లి కావడం లేదని.. కుటుంబీకులతో గొడవపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల వివరాల ప్రకారం.. ప్రశాంత్నగర్ విజ్ఞానపురి కాలనీలో నివసించే ఎం.తిరుమల్రెడ్డి(28) కూకట్పల్లి ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసేవారు. గురువారం మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటలకు తమ్ముడు రవితేజకు ఫోన్ చేశాడు. మేడ్చల్ పరిధి బాసరేగడి ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. తల్లిదండ్రులకు లోటు లేకుండా చూసుకోవాలని తెలిపాడు. రవితేజ, ఆయన బావ హేమంత్రెడ్డి అక్కడికి వెళ్లి, అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
గోవులను అపహరించిన ఐదుగురు పాత నేరస్థుల అరెస్టు
నాచారం, న్యూస్టుడే: గోవులను అపహరించిన ఐదుగురు పాత నేరస్థులను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ నరేష్రెడ్డి వివరాలు వెల్లడించారు. బహదూర్పురకు చెందిన మహమ్మద్ అయూబ్(60) ఆటోడ్రైవర్. మూడు కమిషనరేట్ల పరిధిలో అతనిపై 130 కేసులు, 30 నాన్బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ బాబా(40) ఆటో డ్రైవర్. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అయూబ్ ఖురేషి(34), మహమ్మద్ రఫీక్(50), మహమ్మద్ సద్దాం ఖురేషి(33)పై 40 వరకు కేసులున్నాయి. వీరంతా ఆవులను అపహరించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 15న నాచారం వీరారెడ్డి కాలనీలోని ఎం.వెంకటరెడ్డికి చెందిన అయిదు ఆవులను అపహరించారు. బంజారాహిల్స్ పరిధిలోని ఇమ్రాన్నగర్ వద్ద వధశాలలో వధించి.. మాంసాన్ని విక్రయించారు. దుకాణదారులకు అనుమానం కలగకుండా జియాగూడ మాంసపు మార్కెట్ నుంచి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16న బాధితుడు నాచారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు 80 నిఘానేత్రాలను పరిశీలించి వాహనం వెళ్లిన ప్రదేశం ఇమ్రాన్నగర్గా గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. నిందితులు బాలాపూర్ షరీఫ్నగర్లోని ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి, గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఠాణాకు తరలించి విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షలు, వాహనం, చరవాణులు, తూకం యంత్రం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ, డీఎస్సై, కానిస్టేబుళ్లు ప్రసన్న, రోహిత్లను ఏసీపీ అభినందించారు.
సైబర్ అధ్యాపకురాలికే టోకరా
ఆసిఫ్నగర్, న్యూస్టుడే: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధ్యాపకురాలినే కేటుగాళ్లు మోసం చేశారు. మెహిదీపట్నంలోని ప్రముఖ మహిళా కళాశాలలో నల్లకుంటకు చెందిన అధ్యాపకురాలు బోధిస్తున్నారు. సమాజంలో నిత్యం చోటుచేసుకుంటున్న నేరాలు, మోసాలు తదితర అంశాలపై విద్యార్థులను ఆమె అప్రమత్తం చేస్తుంటారు. ఇటీవల ఆమెకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్చేసి.. మీ ఇంటి కరెంటు బిల్లు పెండింగ్లో ఉందన్నారు. ఆన్లైన్లో కొంత నగదు ట్రాన్స్ఫర్ చేయాలని, వివరాలు నిర్ధారించాక మిగతాది పంపించాలని నమ్మబలికారు. బిల్లు పెండింగ్లో ఉండటంతో.. ఆ మాటలు నమ్మి ఆమె తొలుత కొంత నగదును ట్రాన్స్ఫర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష మాయమైంది. మోసపోయినట్లు గ్రహించిన అధ్యాపకురాలు సైబర్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు.
విమానాశ్రయంలో 1,821 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్, న్యూస్టుడే: దుబాయ్ నుంచి తరలిస్తున్న రూ.కోటి విలువైన అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఒమర్ దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో ఇక్కడికి వచ్చారు. 1,821 గ్రాముల బంగారాన్ని ముద్ద చేసి తన సామగ్రిలో రహస్యంగా తీసుకొచ్చారు. ఒమర్ ప్రవర్తనపై అధికారులకు అనుమానం రావడంతో సామగ్రిని తనిఖీ చేయగా అక్రమ బంగారం తరలింపు గుట్టురట్టయింది. అతడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా