నిబంధనలతో రక్షణ శాఖ రోడ్లలో అనుమతి
కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ సంస్థల మీదుగా ఉన్న కొన్ని రహదారుల్లో ప్రయాణానికి ఎట్టకేలకు నిబంధనలతో అనుమతి ఇస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగించడానికి రక్షణ శాఖ అధికారులు అంగీకరించారు.
బొల్లారం, న్యూస్టుడే: కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ సంస్థల మీదుగా ఉన్న కొన్ని రహదారుల్లో ప్రయాణానికి ఎట్టకేలకు నిబంధనలతో అనుమతి ఇస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగించడానికి రక్షణ శాఖ అధికారులు అంగీకరించారు. మల్కాజిగిరి, జవహర్నగర్- కంటోన్మెంట్ ప్రాంతాల మధ్య అనుసంధానంగా ఉన్న బొల్లారంలోని రహదారుల్లో 2013 నుంచి సాధారణ పౌరుల వాహనాలను నిషేధించారు. తర్వాత కేంద్రమంత్రులు, నేతలు రోడ్లను తెరిపిస్తామని హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో రెండునెలల క్రితం మూసిఉన్న ఆయా రోడ్లను మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల జారీతో వివాదం తలెత్తింది.
తూర్పు, ఉత్తరకాలనీల సమాఖ్య, కంటోన్మెంట్ పౌరుల సంఘం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై వివాదాన్ని వివరించారు. మూసిఉన్న రోడ్లను తిరిగి మూసివేస్తున్నట్లు ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని పౌరులు నిరసలు చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రక్షణ శాఖ అధికారులతో భేటీ అయి సమాలోచనలు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈక్రమంలో కొన్ని రహదారుల్లో ప్రయాణాలకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రినిటి చర్చి, బొల్లారం-కౌకూర్ చెక్పోస్టు, రాష్ట్రపతి నిలయం మీదుగా ఉన్న రహదారుల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే అనుమతి ఇస్తారు. కార్లలో వెళ్లేవారు సీటు బెల్టు పెట్టుకోవాలి. ఏదైనా గుర్తింపు కార్డు ఆయా మార్గాల్లో రక్షణశాఖ సిబ్బందికి చూపిస్తే ప్రయాణానికి అనుమతిస్తారు. లక్డావాల మార్గాన్ని మాత్రం ఇంకా తెరవలేదు. కంటోన్మెంట్లోని మిగతా అన్ని రోడ్లను తెరవాలని ఆయా కాలనీలసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!