రహదారి.. వదల బొమ్మాళి
ఏదైనా రహదారి విస్తరణకు నోచుకోగానే.. రోడ్డుకు ఇరువైపులా ఉండే ప్రభుత్వ స్థలాన్ని, మూలలను, కాలిబాటలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కొందరు యుద్ధం ప్రకటిస్తున్నారు.
కోట్ల రూపాయలతో రోడ్లను విస్తరిస్తున్న జీహెచ్ఎంసీ
నెలల వ్యవధిలోనే ఇరువైపులా దురాక్రమణలు
కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాలిబాటపై ఇలా..
ఈనాడు, హైదరాబాద్: ఏదైనా రహదారి విస్తరణకు నోచుకోగానే.. రోడ్డుకు ఇరువైపులా ఉండే ప్రభుత్వ స్థలాన్ని, మూలలను, కాలిబాటలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కొందరు యుద్ధం ప్రకటిస్తున్నారు. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న రోడ్లను.. నెలలు తిరక్కముందే మింగేస్తున్నారు. ఇవన్నీ నియోజకవర్గాలు, డివిజన్ల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. విశాలమైన రహదారులు, చింత లేని ప్రయాణం, ఆక్రమణల్లేని రోడ్డు మార్గాలతోనే విశ్వనగరం సాకారమవుతుందన్నది స్థానిక నేతలు పూర్తిగా విస్మరిస్తున్నారు. రహదారుల ఆక్రమణలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.
ఇవిగో ఆక్రమణలు..
* మూసాపేట ప్రధాన రహదారి నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం మీదుగా ఆంజనేయనగర్ వరకు 80 అడుగుల వెడల్పుతో రహదారిని విస్తరించే పనులు 12ఏళ్ల కిందట మొదలవగా.. ఇప్పటికీ పూర్తవలేదు. కోర్టు కేసులున్నాయంటూ అధికారులు ఓ వైపు కాలయాపన చేస్తుండగా.. మరోవైపు నిర్మాణాలను తొలగించిన ప్రాంతాల్లోనూ పూర్తిస్థాయిలో నిర్మించట్లేదు. ఫలితంగా.. జీహెచ్ఎంసీ ఆఫీసు చుట్టుపక్కల ఉన్న రోడ్లు, కాలిబాటలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. రహదారులు పార్కింగ్ స్థలాలుగా మారాయి.
* మూసాపేట రెయిన్బో విస్టా నుంచి కైత్లాపూర్ వెళ్లే దారిని జీహెచ్ఎంసీ నాలుగేళ్ల క్రితం 100అడుగుల మేర విస్తరించింది. కైత్లాపూర్లో ఆర్ఓబీ, హైటెక్సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబీ, ఆర్యూబీలు అందుబాటులోకి రావడంతో కైత్లాపూర్ రహదారిపై రాకపోకలు భారీగా పెరిగాయి. రెయిన్బో విస్టా పక్కనున్న కొందరు బస్తీ నాయకులు రహదారిని ఆక్రమించారు. ఆలయం వెనుకవైపుండే పాఠశాల స్థలంలో కమర్షియల్ కాంప్లెక్సు నిర్మించారు.
* కైత్లాపూర్ ఆర్ఓబీ నుంచి పర్వత్నగర్ మీదుగా అయ్యప్పసొసైటీ, కావూరిహిల్స్ మార్గం విస్తరణకు నోచుకోలేదు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించలేదు. ఆయా మార్గాలపై కొత్త దుకాణాలు ఏర్పాటవుతున్నాయి.
* అయ్యప్పసొసైటీని బోరబండతో కలుపుతూ రూ.కోట్ల ఖర్చుతో 100అడుగుల లింకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. అంతలోనే రోడ్డు పక్కన, సున్నం చెరువులో నిర్మాణాలు మొదలయ్యాయి.
* కేపీహెచ్బీకాలనీల్లో రోడ్లన్నీ ఆక్రమణకు గురయ్యాయి. కొత్తగా నిర్మాణమైన రోడ్లలోనూ మరిన్ని దుకాణాలు నిర్మాణమవడం ఆందోళనకు తావిస్తోంది.
నేతల అండదండలతో..
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి పేరుతో మూసాపేట, కైత్లాపూర్లో భూ ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు. ఐడీఎల్ రోడ్డుకు ఇరువైపులా ఎకరాల కొద్దీ ప్రభుత్వ, ఉదాసీన్ మఠం భూముల్లో అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలే అందుకు నిదర్శనం. సుమారు రూ.100కోట్ల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నాయి. హైటెక్సిటీ రైల్వే స్టేషన్ నుంచి హఫీజ్పేట మార్గంలో గోపాల్నగర్ సొసైటీ వద్ద ఆక్రమణలు నానాటికీ పెరుగుతున్నాయి. రహదారుల విస్తరణతో వ్యాపారులు మరింతగా ఆక్రమించేస్తున్నారు. ఖాజాగూడ ప్రధాన రహదారిపై జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్సు వద్ద గతేడాది ఎకరం స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమిస్తుండగా.. అధికారులు వెంటనే తొలగించారు. అదే మాదిరి.. అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలను ఆదిలోనే అడ్డుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన