దిశ మారని భద్రత
అడుగడుగునా ఆకతాయిల అలజడి.. మందుకొడుతూ కేకలు వేసే పోకిరీలు.. రోడ్డుకు ఇరువైపులా వరుసకట్టిన లారీలు.. చిమ్మచీకట్లో దారి కూడా కనిపించని భయానక పరిస్థితి.. నగర శివార్లలో ఔటర్ రింగు రోడ్డు, సర్వీసు రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన పరిస్థితి ఇది.
హత్యాచార ఘటన జరిగి మూడేళ్లయినా మారని పరిస్థితులు
ఔటర్, సర్వీసు రోడ్డు వెంట భయానక వాతావరణం
దిశ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (పాతచిత్రం)
ఈనాడు- హైదరాబాద్, ఘట్కేసర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, దుండిగల్, కీసర, హయత్నగర్: అడుగడుగునా ఆకతాయిల అలజడి.. మందుకొడుతూ కేకలు వేసే పోకిరీలు.. రోడ్డుకు ఇరువైపులా వరుసకట్టిన లారీలు.. చిమ్మచీకట్లో దారి కూడా కనిపించని భయానక పరిస్థితి.. నగర శివార్లలో ఔటర్ రింగు రోడ్డు, సర్వీసు రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన పరిస్థితి ఇది. యువ వైద్యురాలు దిశను కిరాతకంగా హతమార్చిన ఉదంతం జరిగి ఆదివారంతో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఔటరు రింగురోడ్డు ఇంటర్ఛేంజ్లు, సర్వీసు రోడ్డు, సమీప ప్రాంతాల్లో భద్రత ఎలా ఉంది.. మహిళలు వెళ్లేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా..? లేదా అనే కోణంలో ‘ఈనాడు’ కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసింది. ఈ సందర్భంగా అక్కడ భయానక పరిస్థితులు కనిపించాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
లైట్లు వెలిగితే ఒట్టు
భారీ విద్యుద్దీపాలతో ఔటర్ రింగురోడ్డు కాంతులీనుతుంటే పక్కనే సర్వీసు రోడ్డు వెంబడి చిమ్మ చీకటి కనిపిస్తోంది. ఇంటర్ ఛేంజ్ల దగ్గర మినహా ఎక్కువ ప్రాంతాల్లో దీపాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా వెలగడం లేదు. చీకటిపడితే అక్కడికి వెళ్లకపోవడమే మేలనేలా పరిస్థితులున్నాయి. వేలల్లో వాహనాల రాకపోకలు సాగించే ఈ దారిలో ఒంటరిగా లేదా దంపతులు వెళ్లాలన్నా, మహిళలతో ప్రయాణించాలన్నా జడుసుకోవాల్సినందే. ఈ దారిలో వాహనాలు ప్రమాదాలకు గురైనా.. మొరాయించినా వెంటనే సమాచారం అందించి రక్షణ, సహాయం పొందేందుకు ఎవరికి ఫోన్ చేయాలో తెలిపే సూచికలు లేవు. పరిశీలన చేసిన మెజార్టీ ప్రాంతాల్లో అంతా అంధకారమే కనిపించింది.
కనిపించని పెట్రోలింగ్: ఘట్కేసర్, శంషాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు కనిపించలేదు. దిశ ఉదంతం తర్వాత గస్తీ పెంచుతామని ప్రకటించినా ఆ స్థాయిలో కనిపించలేదు. పోలీసు పర్యవేక్షణ లేదన్న భరోసాతో అక్కడక్కడా రోడ్డుపక్కన ఫుట్పాత్లపై బృందాలుగా కూర్చుని మద్యం తాగుతున్నారు. కొన్నిచోట్ల వాహనాలపై ఒక్కరే వస్తుండడాన్ని గమనించి దారిదోపిడీలకు దిగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
అది 2019 నవంబరు 28వ తేదీ.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాలు అమ్మేందుకు వెళ్తున్న ఓ యువకుడు షాద్నగర్ శివారులోని చటాన్పల్లి సమీపంలో 44వ నంబరు జాతీయరహదారి బైపాస్ కింద కాలిపోతున్న ఓ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఆమె శంషాబాద్కు చెందిన యువతిగా గుర్తించారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్లు ముందురోజు రాత్రి తొండుపల్లి గేటువద్ద ఆమె వాహనానికి పంక్చర్ చేసి సహాయం చేస్తున్నట్లు నటించి నిర్బంధించారు. సమీపంలో ఉన్న ఓ గదిలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత లారీలో షాద్నగర్ సమీపంలోకి తీసుకెళ్లి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డిసెంబరు 6న నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు ఓటు అడిగా నైతిక హక్కు లేదు: కేసీఆర్
[ 25-04-2024]
పదేళ్ల భాజపా పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో దిల్సుఖ్నగర్ నారాయణ విద్యార్థుల ప్రతిభ
[ 25-04-2024]
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో దిల్సుఖ్నగర్ నారాయణ డే డివిజన్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులతో సత్తా చాటారు. -
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట