రూ.100 కోట్ల భూమి స్వాహా
హైటెక్సిటీకి ఆనుకుని ఉన్న రూ.100కోట్ల భూమిని ఆక్రమణదారులు మింగేశారు. ప్రభుత్వ భూమినేగాక.. చెరువును, నాలాను, నిషేధిత భూములను.. వేటినీ వదలట్లేదు. ఇళ్లు నిర్మించి గజం రూ.50వేల చొప్పున ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు.
కూకట్పల్లి పరిధిలోని మఠం, చెరువు, నిషేధిత స్థలాల్లో నిర్మాణాలు
రాఘవేంద్రసొసైటీ కాలనీ ప్రాంతంలో వెలసిన నిర్మాణాలు
ఈనాడు, హైదరాబాద్: హైటెక్సిటీకి ఆనుకుని ఉన్న రూ.100కోట్ల భూమిని ఆక్రమణదారులు మింగేశారు. ప్రభుత్వ భూమినేగాక.. చెరువును, నాలాను, నిషేధిత భూములను.. వేటినీ వదలట్లేదు. ఇళ్లు నిర్మించి గజం రూ.50వేల చొప్పున ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు. కైత్లాపూర్, కూకట్పల్లిలో సాగుతోన్న ఆక్రమణల బాగోతమిది. నియోజకవర్గం ముఖ్యనేత అండదండలతో, స్థానిక డివిజన్ నేత మద్దతుతో ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అడ్డుకునేందుకు యత్నించే అధికారులపై బస్తీ నేతలు దాడులు చేస్తుండటం ఆందోళనకు తావిస్తోంది. అధికారులను చంపుతామనే వరకు కబ్జాదారులు బరితెగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యుత్తు, నల్లా కనెక్షన్లు..
మూసాపేట నుంచి కైత్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని.. ఉదాసీన్ మఠం భూములు, కాముని చెరువు శిఖం, చెరువు బఫర్, ఎఫ్టీఎల్ భూములుంటాయి. ఇదంతా.. రెయిన్బో విస్టా నుంచి కైత్లాపూర్ వెళ్లేటప్పుడు ఎడమవైపున ఎదురయ్యే శ్మశానవాటిక లోపలివైపు ఉండే భూమి గురించి. కొన్నేళ్లుగా అక్కడ పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కాలనీని రాఘవేంద్ర సొసైటీ అని పిలుస్తారు. కొంత కాలంగా బస్తీ నేతలు బరితెగించారు. చెరువు ఒడ్డున ఉండే కాలనీని శ్మశానవాటిక వరకు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా రెయిన్బో విస్టా పక్కనున్న గుట్టను చదును చేసి సుమారు 20 ఇళ్లు నిర్మించారు. విద్యుత్తు కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు మంజూరయ్యాయి. రోడ్లు కూడా వేయిస్తామని బేరసారాలు జరుపుతున్నారు.
కైత్లాపూర్ గ్రామానికి పక్కనే.. కూకట్పల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వం కోర్టు కాంప్లెక్సు నిర్మిస్తోంది. భవన సముదాయానికి సమీపంలో, ముళ్లకత్వ చెరువు కట్టకు ఆనుకుని, అంబేడ్కర్నగర్ పక్కన సుమారు రెండెకరాల భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయి. తాజాగా భారత్పెట్రోలు బంకు వెనుకవైపు మైసమ్మచెరువులో మూడెకరాల ఎఫ్టీఎల్ స్థలాన్ని మట్టితో పూడ్చడం గమనార్హం. వాటిపై వివరణ కోరగా.. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించేందుకు నిరాకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు