మైనింగ్ జోన్ను ముక్తకంఠంతో వ్యతిరేకించిన గ్రామస్థులు
యాచారంలో మైనింగ్ జోన్ ఏర్పాటును స్థానికులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పర్యావరణాన్ని దెబ్బతీసే దీనిని అంగీకరించబోమని తెగేసి చెప్పారు.
వేదిక వద్ద నిరసన తెలుపుతున్న ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, సర్పంచులు. వేదికపై అదనపు కలెక్టర్ తిరుపతిరావు, పీసీబీ జిల్లా అధికారి వెంకటనర్సయ్య.
యాచారం, న్యూస్టుడే: యాచారంలో మైనింగ్ జోన్ ఏర్పాటును స్థానికులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. పర్యావరణాన్ని దెబ్బతీసే దీనిని అంగీకరించబోమని తెగేసి చెప్పారు. సర్వే సంఖ్య 146లో 10.177 హెక్టార్లను ఓ సంస్థకు మైనింగ్ శాఖ 2024 వరకు లీజుకు ఇచ్చింది. దీనికి పర్యావరణ అనుమతుల నిమిత్తం అదనపు కలెక్టర్ తిరుపతయ్య, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) జిల్లా అధికారి వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సభ శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, తెరాస మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ మాట్లాడుతూ మైనింగ్ జోన్ ఏర్పాటు ద్వారా జరిగే నష్టాలను ఏకరవు పెట్టారు. పేలుళ్ల శబ్దాలకు ఇళ్లకు పగుళ్లు వస్తాయని, పక్కనే ఉన్న ఆసుపత్రి, కస్తూర్బా విద్యాలయానికి ఇబ్బందులు తప్పవన్నారు. అన్నింటికీ మించి వ్యవసాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ మధ్యలోనే అధికారులు గో.. బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వేదిక వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల చుట్టూ రక్షణగా నిలబడ్డారు. ఎంతకూ అధికారులు అక్కడి నుంచి కదలకపోవడంతో తెరాస ప్రధాన కార్యదర్శి బాషా తదితరులు కుర్చీలను బయటకు విసరడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సభ ముగిస్తున్నట్లు తిరుపతిరావు ప్రకటించడంతో శాంతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!