logo

జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగడం అభినందనీయం

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగడం అభినందనీయమని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు.

Published : 27 Nov 2022 03:34 IST

క్రీడా జ్యోతి వెలిగిస్తున్న జయేశ్‌ రంజన్‌

హబ్సిగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగడం అభినందనీయమని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. రామంతాపూర్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ 43వ వార్షిక క్రీడోత్సవాలు శనివారం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అతిథులు ప్రదానం చేశారు.ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ డా.సల్లారం నర్సింహారెడ్డి, సొసైటీ ఛైర్మన్‌ గుస్తీనోరియా, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని