బాధ్యత మహిళలకేనా..!
‘చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం’ అంటూ వైద్య శాఖ కుటుంబ నియంత్రణ (కు.ని.)కు ప్రచారం చేస్తోంది
కు.ని. చికిత్సలకు చొరవ చూపని పురుషులు
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, పరిగి, పెద్దేముల్
పెద్దేముల్లో ర్యాలీ
‘చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం’ అంటూ వైద్య శాఖ కుటుంబ నియంత్రణ (కు.ని.)కు ప్రచారం చేస్తోంది. జిల్లాలో జరుగుతున్న కు.ని.చికిత్సల వివరాలు చూస్తుంటే కేవలం మహిళలే ఆ బాధ్యత తీసుకుంటున్నారని, పురుషుల జాడ కనిపించడంలేదని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఒకరకమైన అపోహ కారణమని వారు పేర్కొంటూ ఇది నిజం కాదని పురుషులు కూడా ముందుకు రావాలంటున్నారు. మాతృత్వం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న మహిళకు అండగా ఉండాలని కోరుతూ కు.ని. చికిత్సలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయడానికి కార్యాచరణ రూపొందించారు.
అపోహలు వద్దు..
కు.ని.చికిత్సల్లో పురుషులకు వేసెక్టమీ చేస్తారు. పురుషుల్లో మాత్రం దీనిపై పలు అపోహలున్నాయి. ప్రధానంగా తమ మగతనం దెబ్బతింటుందని భావిస్తూ విముఖత చూపుతున్నారని వైద్యులు తెలిపారు. ఇది పూర్తిగా తప్పని, ఎలాంటి లోపం ఉండదని చెబుతున్నారు.
* జిల్లాలో రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్కరూ ఈ ఆపరేషన్ చేయించుకోలేదన్నారు. కు.ని. చేయుంచుకున్న మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.660 నుంచి రూ.880, పురుషులకు రూ.1,100 అందజేస్తున్నా పురుషులు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు.
ఒక్కరంటే ఒక్కరూ లేరు
జిల్లాలో గతేడాది ఏప్రిల్- నవంబర్ నెలల మధ్య 1065 మందికి కు.ని. ఆపరేషన్లు చేశారు. వీరంతా మహిళలే కావడం గమనార్హం.
* 2021-2022 మార్చి వరకు 1419 మంది కు.ని. ఆపరేషన్లు జరిగితే ఈ జాబితాలో కూడా పురుషులు లేరు.
ఊరేగింపుల ద్వారా ప్రచారం
పురుషులు కు.ని.కి చొరవ చూపే విధంగా చేసేందుకు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఊరేగింపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజగా గోడపత్రికను కూడా విడుదల చేశారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సందేహాలు వద్దు.. ముందుకు రండి
- డాక్టర్ పవిత్ర, కు.ని.కార్యక్రమ అధికారిణి
కు.ని.ఆపరేషన్ల విషయంలో పురుషులు కూడా బాధ్యతగా ముందుకు రావాలి. ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తాం. ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వచ్చిన అర్హులైన వారందరినీ కు.ని. చేసుకోవాలని సూచిస్తున్నాం. తాండూరు, వికారాబాద్లలో ప్రచారం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం