logo

వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి

రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు

Published : 27 Nov 2022 03:34 IST

కేసీఆర్‌ కిట్టు అందజేస్తున్న మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.28 లక్షలతో అల్ట్రా స్కానింగ్‌ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్‌, ఉపవైద్యాధికారి నారాయణరావు, కోట్యానాయక్‌, మున్సిపల్‌ ఛైర్మన్లు ముల్లి పావనియాదవ్‌, బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌ఛైర్మన్‌ పి.మాధవరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు