Metro: రూ.6250 కోట్లతో మెట్రో రెండో ఫేజ్.. డిసెంబరు 9న భూమిపూజ: కేటీఆర్
మెట్రో రైలు రెండో విడత పనులకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
హైదరాబాద్: మెట్రో రైలు రెండో విడత పనులకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. 31 కిలోమీటర్ల చేపట్టే మెట్రో నిర్మాణానికి సుమారు రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్లో మెట్రో విస్తరణకు నవంబరులోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. మెట్రో పనులకు నిధులు కేటాయించాలని కోరారు. మరోవైపు కేంద్రం నిధులు సమకూర్చినా, సమకూర్చలేకపోయినా మెట్రో విస్తరణ పనులు చేపడతామని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు డిసెంబరు 9న భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, మెట్రో నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరిస్తోందా? గతంలో మాదిరి పీపీపీ మోడల్లో చేపడుతోందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని ఇటీవలే నిర్ణయించారు. దీన్ని కూడా ఇందులో భాగంగా చేపడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు మిగిలిపోయిన మెట్రో మార్గాన్ని కూడా ఇందులోనే చేరుస్తారా? దీనికి కూడా భూమిపూజ ఆ రోజే చేస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్ మెట్రోలో కరోనా ముందు వరకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 4లక్షలుగా ఉంది. క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ జరిగినట్లయితే ఇంకా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా తగ్గొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ ట్వీట్పై స్పందించిన ఓవైసీ
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎంజీబీఎస్-ఫలక్నుమా కారిడార్-2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కి.మీ దూరం ఉన్న ఈ కారిడార్కు రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం