రద్దీ తక్కువ.. ప్రమాదాలు ఎక్కువ
మాదాపూర్ సైబర్టవర్స్ ఫ్లైఓవర్పై ఇటీవల ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. చోదకుడు సహా మరొకరు మరణించారు. ప్రమాదానికి కారణం.. రోడ్డు ఖాళీగా ఉందని హెల్మెట్ కూడా లేకుండా అతివేగంతో వెళ్లడమే.
ఖాళీ రోడ్లపై మితిమీరిన వేగం..
ఈనాడు, హైదరాబాద్: మాదాపూర్ సైబర్టవర్స్ ఫ్లైఓవర్పై ఇటీవల ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. చోదకుడు సహా మరొకరు మరణించారు. ప్రమాదానికి కారణం.. రోడ్డు ఖాళీగా ఉందని హెల్మెట్ కూడా లేకుండా అతివేగంతో వెళ్లడమే.
ఖాళీ రోడ్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకెళ్లడం, నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా జరిగే వాటిలో సగటున 35 శాతం రహదారులు ఖాళీగా ఉన్న సమయంలో.. అదీ రాత్రి ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలో అధ్యయనం.. నగరంలో ఏటా 8 వేలకుపైగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 1500 మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున 2800 సంఘటనలు రద్దీ అంతగా లేని సమయంలో చోటుచేసుకొంటున్నాయి. ఏ సమయంలోనైనా కచ్చితంగా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళ సిగ్నళ్లను పట్టించుకోకుండా దూసుకెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు విశ్లేషించారు.
ఇవీ కారణాలు
* అతి వేగంతో వెళ్తూ.. వాహనాన్ని అదుపుచేయలేకపోవడం
* ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం ః కూడళ్ల దగ్గర సిగ్నల్ జంప్
* అపసవ్య దిశలో రాకపోకలు
* సాయంత్రం 6 తర్వాత ఇంటికి త్వరగా వెళ్లాలన్న హడావుడి
* మద్యం తాగి ఆ మత్తులో నడపడం
* ముందు వెళ్తున్న వాహనాన్ని దాటేయాలన్న ఆతృత
* ఫోన్లో మాట్లాడుతూ.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడం
నియంత్రణ ఎలా..
* రోడ్డు ఖాళీగా ఉన్నా పరిమిత వేగంతోనే వెళ్లాలి
* ఇతర వాహనాలను చూసి పోటీ పడకూడదు
* పగటి సమయంతో పోలిస్తే రాత్రివేళ ఏకాగ్రత తగ్గుతుంది. దూరంగా ఉండేవి పూర్తిగా కనిపించవు. నిద్రమత్తులో డ్రైవింగ్కు దూరం ఉత్తమం.
* అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజాము సమయంలోనైనా సిగ్నళ్ల దగ్గర దూకుడుగా వెళ్లకూడదు. రెడ్సిగ్నల్ పడితే కచ్చితంగా వాహనం ఆపాలి.
* రహదారిపై ఎవరూ లేరన్న ధైర్యంతో రాంగ్రూట్లో అసలు వెళ్లకూడదు.
* వంపులు తిరిగి ఉండే దారులపై సూచికలను చూస్తూ నెమ్మదిగా వెళ్లాలి.
* వేగంగా వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనానికి కనీసం 50 మీటర్ల దూరంలో ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?