ప్రయాణికుల భద్రత, మెరుగైన సేవలకు కృషి
రైల్వే ప్రయాణికులకు భద్రతతోపాటు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ దేబస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు.
రైళ్లలో మర్చిపోయిన రూ.42 లక్షల సొత్తు బాధితులకు అప్పగింత
ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ దేబస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: రైల్వే ప్రయాణికులకు భద్రతతోపాటు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ దేబస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. 2022 ఏడాదిలో ప్రయాణాల వేళ రైల్వే ప్రయాణికులు వివిధ సందర్భాల్లో మర్చిపోయిన బంగారు నగలు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులతోపాటు నగదునూ సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఆమె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి మొత్తం విలువ రూ.42 లక్షలుగా ఉంటుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉప్పలూరు వాసి కుటుంబసభ్యులతో కలిసి రైల్లో నగరానికి వచ్చాడు. రైలు దిగే హడావుడిలో ఆయన భార్య హ్యాండ్బ్యాగును మర్చిపోయారు. అందులో రూ.3.50 లక్షల 68 గ్రాముల బంగారు ఆభరణాలు, చరవాణి ఉన్నాయని ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింహ బృందం దర్యాప్తు చేపట్టి.. గంటల వ్యవధిలోనే వాటిని గుర్తించి బాధితులకు తిరిగి అందజేశామన్నారు. ఇదే తరహాలో ఎందరో ప్రయాణికులు వివిధ సందర్భాల్లో మరిచిపోయిన రూ.లక్షల విలువైన సొత్తును వారికి అప్పగించామన్నారు. రైళ్లలో అనుమానిత వ్యక్తులు, వస్తువులను గుర్తిస్తే రైల్వే హెల్ప్లైన్ నంబరు 139కు లేదా పోలీసు కంట్రోల్ నంబరు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!