logo

విధులకు వెళ్తూ.. అనంతలోకాలకు

ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ట్రావెల్స్‌ బస్సు ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

Published : 29 Nov 2022 04:50 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ట్రావెల్స్‌ బస్సు ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. జీడిమెట్ల ఠాణా పరిధిలో షాపూర్‌నగర్‌ కేర్‌వెల్‌ ఆసుపత్రి ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మన్మధరావు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రపదేశ్‌లోని  తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన జగదీశ్‌(42), శ్రీనాగలక్ష్మీప్రసన్న దంపతులు గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో నివాసముంటున్నారు. జగదీశ్‌ మెదక్‌ జిల్లా శభాష్‌పల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై విధులకు బయలుదేరారు. షాపూర్‌నగర్‌ రోడ్డులో కేర్‌వెల్‌ ఆసుపత్రి వద్దకు వెళ్లగానే.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీ కొట్టడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. బస్సు చక్రాలు శరీరం మీద నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని