logo

గ్రేటర్‌లో మరో 37 బస్తీ దవాఖానాలు

గ్రేటర్‌లో కొత్తగా మరో 37 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బల్దియా నిర్ణయించింది. ఇందులో 20 ప్రారంభానికి సిద్ధమైనట్లు మంగళవారం తెలిపింది.

Published : 30 Nov 2022 01:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో కొత్తగా మరో 37 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బల్దియా నిర్ణయించింది. ఇందులో 20 ప్రారంభానికి సిద్ధమైనట్లు మంగళవారం తెలిపింది. మరో 17 ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. గ్రేటర్‌ వ్యాప్తంగా 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 263 అందుబాటులోకి తెచ్చారు. కాలనీల పరిధిలో కమ్యూనిటీ హాళ్లు ఇతర ప్రభుత్వ భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఓపీతోపాటు ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్భిణులు, బాలింతలకు పరీక్షలు, టీకాలు, బీపీ, మధుమేహంతోపాటు తదితర పరీక్షలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని