logo

పింఛను.. ఉద్యోగుల హక్కు : యూటీఎఫ్‌

 2004 ఏప్రిల్‌ తరువాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ విధానం, జాతీయ పెన్షన్‌ ఉద్యోగుల హక్కు అని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట రత్నం అన్నారు.

Published : 30 Nov 2022 01:58 IST

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే:  2004 ఏప్రిల్‌ తరువాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ విధానం, జాతీయ పెన్షన్‌ ఉద్యోగుల హక్కు అని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట రత్నం అన్నారు. సీపీఎస్‌, ఎన్‌ఈపీ రద్దు కోరుతూ జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ, జీపుజాత కార్యక్రమం మంగళవారం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఉపాధ్యక్షులు నర్సిములు, బాబురావు, పవన్‌, జమున, మెయిజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ధారూర్‌: సీపీయస్‌ విధానం రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయులతో సంతకాలు సేకరించి మాట్లాడారు. యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధాయ్యులు దేవ్యా, అజయ్‌కుమార్‌, ప్రభాకర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని