mlc kavitha: వైఎస్‌ షర్మిల ‘కమలం’ వదిలిన బాణం: ఎమ్మెల్సీ కవిత

తెరాస ఎమ్మెల్సీ కవిత, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విటర్లో ఒకరిపై ఒకరు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు.

Updated : 30 Nov 2022 16:37 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కవిత, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విటర్లో ఒకరిపై ఒకరు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ‘‘పాదయాత్రలు చేసిందీ లేదు.. ప్రజల సమస్యలు చూసిందీ లేదు.. ఇచ్చిన హామీల అమలూ లేదు. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’’ అని షర్మిల ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. షర్మిల ‘కమలం’ వదిలిన బాణం అంటూ ట్వీట్ చేశారు. ‘‘అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం. పాలేవో.. నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణం. మీకు నిన్నటి దాకా పులివెందులలో ఓటు. నేడు తెలంగాణ రూటు. కమలం కోవర్టు.. ఆరెంజ్‌ ప్యారెట్టు. మీలాగా పొలిటికల్‌ టూరిస్టును కాను నేను. రాజ్యం వచ్చాకే రాలేదు. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ‘కవిత’ను నేను!’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని