మీరు ఆ ఖాతాలో పడకండి
‘హాయ్ డియర్.. నా పాకెట్ మనీతో నిన్న ఒక అద్భుతం జరిగింది. బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నమ్మశక్యంకాని రీతిలో లాభాలొచ్చాయి.
ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసి ఫాలోవర్లకు మెసేజ్లు
క్రిప్టో కరెన్సీ, పెట్టుబడులతో లాభాలంటూ సైబర్ మోసాలు
ఈనాడు- హైదరాబాద్: ‘‘హాయ్ డియర్.. నా పాకెట్ మనీతో నిన్న ఒక అద్భుతం జరిగింది. బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నమ్మశక్యంకాని రీతిలో లాభాలొచ్చాయి. రూ.5 వేలు పెడితే మూడు గంటల్లో ఆ మొత్తం రూ.లక్ష అయ్యింది. కావాలంటే కింద ఉన్న స్క్రీన్షాట్ చూడు. నువ్వూ లింకు తెరిచి పెట్టుబడి పెట్టు’’ ఇలాంటి సందేశం మీ గర్ల్ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వచ్చిందా..! ఏమిటని అడగకుండా లింకు తెరిచి పెట్టుబడి పెడితే మీరు నిండా మునిగినట్లే. సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ గురైతే పోతే పోయింది.. కొత్తది ప్రారంభించవచ్చని తేలిగ్గా వదిలేశారో.. అంతే సంగతులు..! మీ ఖాతా ద్వారా డబ్బు పంపాలంటూ స్నేహితులు, ఫాలోవర్లకు సందేశాలు పంపడంతోనే ఆగడం లేదు. పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలొస్తాయని, క్రిప్టోలో డబ్బు పెట్టాలంటూ నకిలీ లింకులు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని నెలలుగా ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేస్తున్న కేసులు నగరంలో గణనీయంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఎక్కువుంటే అంతే..!
ప్రముఖులతో పాటు.. వంటలు, సరదా వీడియోలు చేసేవారికి ఇన్స్టాగ్రామ్లో భారీఎత్తున ఫాలోవర్లు ఉంటున్నారు. పాస్వర్డ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం.. నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. హ్యాక్ చేసి.. స్నేహితులకు, ఫాలోవర్లకు పెట్టుబడులు పెట్టాలంటూ లింకులు పంపుతున్నారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించే నిందితుడు.. భారీగా సొమ్ము పెట్టాక.. డబ్బు తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తాడు. ఖాతా నిర్వహించే అసలు వ్యక్తికి ఫోన్ చేస్తేగానీ అసలు విషయం తెలియడం లేదు.
మహిళల ఖాతాలే లక్ష్యం
హ్యాక్కు గురయ్యే ఖాతాల్లో ఎక్కువగా మహిళలు, యువతులకు సంబంధించినవే ఉంటున్నాయి. యువతులు, మహిళలు రీల్స్ ఎక్కువగా పోస్టు చేస్తుంటారు. వీరి ఖాతాను అనుసరించే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. నేరగాళ్లు వారి ఖాతాలను తేలిగ్గా హ్యాక్ చేసి ఫాలోవర్లకు నకిలీ లింకులు పంపిస్తున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలా రూ.30 లక్షలు మోసపోయాడు.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
జి.శ్రీధర్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ
‘సామాజిక మాధ్యమ ఖాతా హ్యాక్కు గురైనా.. వాటి ద్వారా స్నేహితులకు లింకులు పంపించినట్లు తెలిసిన వెంటనే పోలీసుల్ని సంప్రదించాలి. పెట్టుబడులతో డబ్బు మోసపోయిన వారు ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. 1930కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
కనీసం 12 అక్షరాలుండాలి..
అడ్లకాడి రంజిత్, ఎథికల్ హ్యాకర్
‘పాస్వర్డ్ నంబర్లు, అక్షరాలు, సంజ్ఞలతో సంక్లిష్టంగా ఉండాలి. కనీసం 12 అక్షరాలకు ఉండాలి. స్నేహితులు ఎంత దగ్గరి వారైనా వారి సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వచ్చే లింకుల్ని నమ్మకూడదు.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్