స్థానికంలో రాజకీయ కాక!
నగర శివారుల్లో రాజకీయ వేడి మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్ లేదా మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలి.
శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వేడెక్కిన పరిస్థితులు
అవిశ్వాసాలకు సిద్ధమవుతున్న వైరి వర్గీయులు
ఈనాడు, హైదరాబాద్: నగర శివారుల్లో రాజకీయ వేడి మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్ లేదా మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలి. వచ్చే జనవరి 25 నాటికి మూడేళ్ల పదవీ కాలం పూర్తి కానుండటంతో వ్యతిరేక వర్గాలు ఈ ప్రయత్నాల్లో మునిగాయి.
మూడేళ్లలో మార్పులెన్నో..
హైదరాబాద్ చుట్టుపక్కల 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. అధిక స్థానాల్లో తెరాస తరఫున గెలిచిన నాయకులే ఛైర్మన్లు, మేయర్లుగా కొనసాగుతున్నారు. ఆదిభట్ల, తుర్కయాంజల్ మున్సిపాలిటీలతోపాటు బడంగ్పేట కార్పొరేషన్లో కాంగ్రెస్ నాయకులు ఛైర్మన్లుగా ఉన్నారు. తుక్కుగూడ, ఆమన్గల్లో భాజపా నాయకులు ఛైర్మన్లుగా ఉన్నారు. జల్పల్లిలో ఎంఐఎం, మణికొండలో కాంగ్రెస్, భాజపా సంయుక్తంగా అధికారంలో ఉన్నాయి. మిగిలిన చోట్ల తెరాస నాయకులే ఛైర్మన్గా కొనసాగుతున్నారు. గత మూడేళ్లలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు ఛైర్మన్లు ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి చేరారు. ప్రత్యర్థి పార్టీలు గుర్రుగా ఉన్నాయి. వారిపై అవిశ్వాసం పెట్టేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నాయి. దీనికితోడు అధికార తెరాస పాలన కొనసాగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ వర్గ పోరుతోనూ ప్రతిపాదనలు నడుస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
* జవహర్నగర్ కార్పొరేషన్లో మేయర్ కావ్య నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తం 28 డివిజన్లలో దాదాపు 20 మంది కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
* బడంగ్పేట కార్పొరేషన్లో 32 డివిజన్లు ఉన్నాయి. 13 తెరాస, పది భాజపా, ఏడు కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు తెరాసకు మద్దతుగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన పారిజాత తెరాస మద్దతుతో మేయర్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆమె తీరుపై తెరాస గుర్రుగా ఉండటంతో ఇతరులు లేదా ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో అవిశ్వాసానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
* బండ్లగూడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. మేయర్పై ఇప్పటికే పలు పర్యాయాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 22 మంది కార్పొరేటర్లు ఉండగా.. 14 మంది తెరాస, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు భాజపా, ఒకరు ఎంఐఎంకు చెందినవారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. మేయర్ను దించాలని వ్యతిరేక వర్గం ప్రయత్నాల్లో ఉంది.
* దమ్మాయిగూడలో మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రణీత విషయంలో సొంత పార్టీ కౌన్సిలర్లే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 18 వార్డులకు మూడు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. 15 మంది కౌన్సిలర్లు తెరాస తరఫున ఉన్నారు. వారిలో మెజార్టీ సభ్యులు అవిశ్వాసం తీసుకొస్తామని చెబుతున్నారు.
* ఆదిభట్లలో కాంగ్రెస్లో గెలిచి తెరాస మద్దతుతో ఆర్తిక ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ 15 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎనిమిది మంది కాంగ్రెస్, ఆరు తెరాస, ఒకరు భాజపా తరఫున ఉన్నారు. తెరాస నాలుగు ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో ఆర్తికను ఛైర్పర్సన్ను చేసింది. తర్వాత ఆమె తిరిగి కాంగ్రెస్లోకి మారడంతో ఆమెను దించేందుకు తెరవెనుక వ్యూహాలు నడుస్తున్నాయి.
* బోడుప్పల్లో మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయారు. పీర్జాదిగూడలోనూ ఇదే పరిస్థితి.
* పోచారం, ఘట్కేసర్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మధ్య విభేదాల నేపథ్యంలో అవిశ్వాసానికి వ్యూహాలు రచిస్తున్నారు.
* తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఆది నుంచి ఎంతో కీలకంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మదన్మోహన్ తెరాస మద్దతుతో ఛైర్మన్ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయన భాజపాలో చేరారు. తెరాసకు ఐదుగురు, భాజపాకు తొమ్మిది కౌన్సిలర్లుండగా.. ఎక్స్అఫీషియా సభ్యుల మద్దతుతో గులాబీ దళం మరోసారి వ్యూహాలు అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
[ 20-04-2024]
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.