ప్లాట్లు చేసి.. రూ. కోట్లు మేసి
ప్రజాప్రతినిధుల పేరును అడ్డం పెట్టుకుంటారు.. అనుచరులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తారు.. పేదలకు అంటగట్టి.. రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు.
గాజులరామారం ప్రభుత్వ భూముల్లో నేతల కబ్జాపర్వం
80 గజాల స్థలానికి రూ.10-12 లక్షలు వసూలు
ఈనాడు, హైదరాబాద్
టీఎస్ఐఐసీకి కేటాయించిన స్థలంలో నిర్మాణాలు
ప్రజాప్రతినిధుల పేరును అడ్డం పెట్టుకుంటారు.. అనుచరులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తారు.. పేదలకు అంటగట్టి.. రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలంలోని కొందరు చోటా మోటా నాయకులు సాగిస్తున్న భూ దందా ఇది. ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. ప్రభుత్వ భూములు ప్లాట్లు చేసి విక్రయిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది.
నగర శివారులో గాజులరామారంలో సర్వే నం.79లో 461.28 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2007లో రాజీవ్ గృహకల్పకు 23.24 ఎకరాలు కేటాయించారు. 2009లో రాజీవ్ స్వగృహకు 29.16 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమి ఖాళీగా ఉండటంతో ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఏళ్ల తరబడిగా హౌసింగ్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో ఎకరా కూడా ఖాళీ లేకుండా కబ్జాలు జరిగాయి.
మేం ఉన్నాం.. ఆక్రమించుకోండి
ఈ ఆక్రమణల వెనుక స్థానికంగా నేతలుగా చలామణీలో ఉన్న వారే ఉన్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు తోడయ్యాయి. రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాల వద్ద ఇద్దరు నాయకులు దందా సాగిస్తున్నారు. ఇళ్లు లేని వ్యక్తుల నుంచి రూ.5-10లక్షలు వసూలు చేసి 80గజాల చొప్పున ప్లాట్లు చేసి కేటాయిస్తున్నారు. రాత్రికిరాత్రే ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిసి కూలగొట్టేందుకు ప్రయత్నించినా.. ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు చేయించి ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరకు తూతూమంత్రంగా కూలగొట్టి వదిలేస్తున్నారు. చివరకు భూములు దక్కించుకున్న సంస్థల అధికారులు సైతం నాయకులతో చేతులు కలపడంతో కబ్జారాయుళ్లు దండుకుంటున్నారు.
హద్దుల్లేకుండా చేసి..
ప్రభుత్వ భూమికి హద్దులు గుర్తించేలా ఎక్కడా మార్కింగ్ లేవు. ఇది సదరు నాయకులకు వరంగా మారింది. రాజీవ్ స్వగౄహ ఇళ్ల పక్కనే టీఎస్ఐఐసీకి 250 ఎకరాలు కేటాయించారు. ఈ స్థలం చుట్టూ కంచె వేసే విషయంలో అధికారుల్లో చలనం లేకుండాపోయింది. ఒకవైపు టీఎస్ఐఐసీకి చెందిన స్థలం అని బోర్డులు ఉన్నా.. ప్లాట్లు చేసి విక్రయాలు చేపట్టడంతో స్థానిక నాయకుల చేతుల్లో ఫలహారం అవుతోంది.
ఇంటి నంబర్లు.. విద్యుత్తు కనెక్షన్లు..
ప్రభుత్వ భూమిలో ఇళ్లకు స్థానిక నాయకులే అనధికారికంగా నంబర్లు కేటాయిస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్లు కూడా జారీ అవుతున్నాయి. గాజులరామారంలో సర్వే నం.49లో దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో ఓ నాయకుడు చక్రం తిప్పుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు 80 గజాల స్థలం రూ.10-12 లక్షల మధ్య విక్రయిస్తున్నట్లు తేలింది. రేకుల షెడ్డు కట్టుకుని ఉండేందుకు వీలవు తుందంటూ స్థానికుడొకరు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?