logo

బాలల వికాసానికి కృషి చేయాలి

బాలల వికాసం కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త శాంతా సిన్హా అన్నారు.

Published : 02 Dec 2022 02:24 IST

మాట్లాడుతున్న శాంతా సిన్హా

బేగంపేట, న్యూస్‌టుడే: బాలల వికాసం కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త శాంతా సిన్హా అన్నారు. బోయిగూడలోని డాన్‌బాస్కో ప్రధాన కార్యాలయంలో.. ‘డాన్‌బాస్కో నేషనల్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎంగ్‌ ఎట్‌ రిస్క్‌’ అంశంపై గురువారం జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శాంతాసిన్హా మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలను, వీధి బాలలను ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు గల అవకాశాలను అన్వేషించడం అందరి కర్తవ్యమన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు పటిష్ఠమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఫాథర్‌ థామస్‌ శాంతియాగు, యూనిసెఫ్‌ ప్రతినిధి డేవిడ్‌రాజ్‌, ఫాథర్‌ టోనీ పెల్లిస్సేరీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని