ట్రాఫిక్ సారథి ఎవరో?
నగర ట్రాఫిక్ విభాగానికి కొత్త సారథి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నగరంలో 2020 జనవరిలో వ్యక్తిగత వాహనాలు దాదాపు 64 లక్షలుండగా.. 2022 ఆగస్టు నాటికి 77.65 లక్షలకు అంటే ఒకేసారి 18 శాతం పెరిగాయి.
ఈనాడు, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగానికి కొత్త సారథి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నగరంలో 2020 జనవరిలో వ్యక్తిగత వాహనాలు దాదాపు 64 లక్షలుండగా.. 2022 ఆగస్టు నాటికి 77.65 లక్షలకు అంటే ఒకేసారి 18 శాతం పెరిగాయి. అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ‘ఆపరేషన్ రోప్’ అక్టోబరులో ప్రారంభించారు. ఆక్రమణదారులు, ఉల్లంఘనదారులపై కొరడా ఝుళిపించారు. ఈ కార్యక్రమ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రంగనాథ్ను వరంగల్ పోలీస్ కమిషనర్గా బదిలీ చేసినా, కొత్త సంయుక్త కమిషనర్ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్కు అదనపు బాధ్యతల కింద అప్పగించారు.
చెరగని ముద్ర:
ఏవీ రంగనాథ్ నగరంలో ట్రాఫిక్ సమస్య కొలిక్కి తెచ్చేందుకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాదచారుల కోసం పెలికాన్ సిగ్నళ్లు ఏర్పాటు చేయించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ల కట్టడికి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. గతంలో నగర ట్రాఫిక్ డీసీపీగా పనిచేసిన రంగనాథ్ 2017లో నల్గొండ ఎస్పీగా బదిలీపై వెళ్లారు. 2021 డిసెంబరులో పదోన్నతిపై నగర ట్రాఫిక్ సంయుక్త కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?