logo

మంత్రి కేటీఆర్‌ ‘ఆట’విడుపు

కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం విస్తృతంగా పర్యటించి రూ.28.51 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు

Published : 03 Dec 2022 03:52 IST

కేపీహెచ్‌బీలో మేయర్‌ విజయలక్ష్మితో కలిసి షటిల్‌ ఆడుతున్న మంత్రి కేటీఆర్‌

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం విస్తృతంగా పర్యటించి రూ.28.51 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం 11 గంటలకు కేపీహెచ్‌బీకాలనీ ఏడోఫేజ్‌లో ప్రారంభమైన ఆయన పర్యటన మధ్యాహ్నం 1.20 గంటలకు ఓల్డ్‌బోయిన్‌పల్లి ఆర్‌ఆర్‌నగర్‌లో ముగిసింది. కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లో కైలాసవాసం పేరిట నిర్మించిన శ్మశానవాటికను పారిశుద్ధ్య కార్మికురాలితో ప్రారంభింప చేయించారు. ఇండోర్‌ షటిల్‌ కోర్టులను ప్రారంభించిన సందర్భంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి రాకెట్‌ పట్టుకుని షటిల్‌ ఆడారు. మంత్రిని కలిసేందుకు వచ్చిన పలువురు మహిళలను ఆప్యాయంగా పలకరించి వారితో సెల్ఫీలు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని