logo

ఇంకని కన్నీళ్లకు ఇంకో పరీక్ష

బాలుడి మృతదేహాన్ని తీసుకొస్తుండగా.. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్టి ముగ్గురికి గాయాలైన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది.

Published : 03 Dec 2022 03:52 IST

కుమారుడి మృతదేహాన్ని తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదం

సంఘటనా స్థలంలో ఓ వైపు కుమారుని మృతదేహం, మరోవైపు గాయపడిన భార్యతో షేక్‌షాదుయ్‌.

శామీర్‌పేట, న్యూస్‌టుడే: బాలుడి మృతదేహాన్ని తీసుకొస్తుండగా.. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్టి ముగ్గురికి గాయాలైన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన షేక్‌షాదుయ్‌-హసీయాబేగం దంపతుల పెద్దకుమారుడు షేక్‌రెహన్‌(2) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రహమత్‌బాద్‌ దర్గాలో బాగు చేయించేందుకు వెళ్లారు. ఈ నెల 1న సాయంత్రం బాలుడు మూర్ఛతో అక్కడ మృతి చెందాడు. దంపతులు కుమారుడి మృతదేహాన్ని నిజామాబాద్‌కు తరలించేందుకు నెల్లూరుకు చెందిన షేక్‌మీరాజ్‌(22) కారును అద్దెకు తీసుకున్నారు. మరో డ్రైవర్‌ ఇలియాస్‌(32)తో కలిసి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఇలియాస్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో ఓఆర్‌ఆర్‌పై  నిద్ర మత్తులో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టాడు. ముందున్న ఇద్దరి డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. హసీయాబేగానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని