logo

ప్రేమ విఫలమైందని యువకుడి మనస్తాపం

ప్రేమ విఫలమైందన్న బాధతో ఓ యువకుడు ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎస్‌ఐ హారిక తెలిపిన వివరాలు.

Published : 03 Dec 2022 04:12 IST

ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రేమ విఫలమైందన్న బాధతో ఓ యువకుడు ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎస్‌ఐ హారిక తెలిపిన వివరాలు.. పాతబోయిన్‌పల్లివాసి రెడ్డిచర్ల కిషోర్‌రాజు (26) బీటెక్‌ పూర్తి చేసి కొంతకాలం ఉద్యోగం చేసి మానేశాడు. గురువారం రాత్రి తన అన్న కిరణ్‌రాజుతో కలిసి మాదాపూర్‌లోని మిర్రా రెసిడెన్సీలో ఉంటున్న స్నేహితుడు శరత్‌చంద్ర పుట్టినరోజు వేడుకలకు వచ్చారు. రాత్రి ముగ్గురూ కలసి ఐదంతస్తుల భవనంపై కూర్చొని మద్యం తాగారు. కిషోర్‌రాజు తన ప్రేమ విఫలమైందని, ఆ యువతి లేకుండా బతకలేనంటూ భావోద్వేగానికి గురై మిద్దె మీదనుంచి కిందకు దూకాడు.. కిరణ్‌రాజు, శరత్‌ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వదిలించుకొని కిందకు దూకేయడంతో తీవ్రగాయాలయ్యాయి. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని