KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులూ మోసపోవడం బాధాకరం: కేటీఆర్
అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం బాధాకరమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సైబరాబాద్లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్: అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం బాధాకరమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సైబరాబాద్లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరా నియంత్రణకు, వేగంగా దర్యాప్తు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సియంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సెంటర్ దేశంలోనే మొట్ట మొదటిది కావడం విశేషం.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అంతా ఇంటర్నెట్తో సాగుతోంది. ప్రతి వస్తువు వైఫైతో పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో సైబర్ భద్రత చాలా పెద్ద ఛాలెంజ్. సైబర్ మోసాల బారిన పడిన వాళ్లకు 1930 టోల్ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. కానీ, ఈ విషయం ప్రజలకు చేరట్లేదు. సైబర్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా.. ఇతర కంపెనీలు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలి. హైదరాబాద్లో లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నేరాల బారిన పడుతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు ఉండటం బాధాకరం. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితా రూపొందించాలి. ఓ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితా ఉంచాలి’’ అని మంత్రి కేటీఆర్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు