logo

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సద్వినియోగం చేసుకోండి

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 04 Dec 2022 01:59 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌ తెలిపారు. జాబితా ప్రకటించిన నేపథ్యంలో తప్పుల సవరణతోపాటు పేర్లు లేని వారు ఈనెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 6,743 మంది ఉపాధ్యాయ ఓటర్లు నమోదు చేసుకున్నారన్నారు. నమోదు కోసం ఫారం-19, అభ్యంతరాలు, పేర్ల తొలగింపునకు ఫారం-7, తప్పొప్పుల సవరణకు ఫారం-8 సమర్పించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని