తొలిమెట్టు.. పక్కాగా సాగేట్టు!
‘తొలిమెట్టు’ను జిల్లా వ్యాప్తంగా పక్కాగా అమలు చేసేందుకు విద్యాశాఖ ముమ్మర చర్యలు తీసుకుంటోంది.
పరిశీలనకు ‘టాస్క్ఫోర్స్’ ఏర్పాటు
న్యూస్టుడే, కొడంగల్ గ్రామీణం, వికారాబాద్
కొడంగల్లో సామర్థ్యాలు పరిశీలిస్తున్న ఎంఈవో రాంరెడ్డి
‘తొలిమెట్టు’ను జిల్లా వ్యాప్తంగా పక్కాగా అమలు చేసేందుకు విద్యాశాఖ ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రత్యేక పర్యవేక్షణకు ‘అకడమిక్ మానిటరింగ్ టాస్క్ఫోర్స్ కమిటీ’ ఏర్పాటుకు ఆదేశించింది. ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం విజయవంతం చేయడమే లక్ష్యంగా కమిటీ పని చేస్తుందని అధికారులు వివరిస్తున్నారు.
పాలనాధికారి పర్యవేక్షణ ...
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్ మానిటరింగ్ టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ఛైర్మన్గా జిల్లా పాలనాధికారి వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా విద్యాశాఖ అధికారి, సెక్టోరియల్ అధికారి, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్, ఎంఈవో, క్లస్ట్రర్ రిసోర్స్ పర్సన్, విద్యా రంగంలో పనిచేస్తున్న ఎన్జీవో ప్రతినిధి ఉంటారు.
ప్రాథమిక స్థాయిలోనే సామర్థ్యాల పెంపు
జిల్లాలోని 763 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 55,981 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సామర్థ్యాలు పెంచేందుకు ఆగస్టు నుంచి తొలిమెట్టు అమలవుతోంది. ప్రసుతం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న టాస్క్ఫోర్సు కమిటీ పని చేయాల్సిన విధివిధానాలకు మార్గదర్శకాలు నిర్దేశించారు. తొలిమెట్టు ప్రణాళికకు అనుగుణంగా నెలవారిగా ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తారు. పాఠశాలల పనితీరు, విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తారు. ఉపాధ్యాయులు బోధనలో సామర్థ్యాలు పెంచుకునేందుకు టీఎల్ఎం తయారీ, విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధన పద్ధతులను పరిశీలిస్తారు. వందశాతం ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించేలా ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తారు. ఎమ్మార్సీ, సీఆర్సీల మధ్య సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందిస్తారు.
ప్రత్యేకంగా నివేదికలు
ఈ కమిటీ సభ్యులు పాఠశాలలను సందర్శించి తొలిమెట్టు కార్యక్రమాల అమలు, ఉపాధ్యాయుల బోధనతీరు, విద్యార్థులు నేర్చుకుంటున్న విధానంపై పరిశీలన చేస్తారు. తొలిమెట్టు అమలుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్పోర్సును ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రవికుమార్ తెలిపారు.
బోధన పేరుతో ఒత్తిడి సరికాదు
- చంద్రశేఖర్, పీఆర్టీయూ, జిల్లా అధ్యక్షులు
టాస్క్ఫోర్సు విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. బోధన పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచవద్దని అభిప్రాయపడుతున్నాం. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పట్టించుకోకుండా ఇలా చేయడం న్యాయం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్