బాధలకు చలించి.. బాధ్యతతో ఆలోచించి..
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దివ్యాంగులు, అంధులు, వృద్ధుల బాధలు చూసి చలించారు. వారికి ఆసరాగా నిలిచే పరికరాలను ఆవిష్కరించాలని లోతుగా ఆలోచించారు.. చివరికి సాధించారు.
దివ్యాంగులకు సహాయకారిగా నిలిచే ఆవిష్కరణలు
వేదికైన టీఎస్ఐసీ
రాయదుర్గం, న్యూస్టుడే: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దివ్యాంగులు, అంధులు, వృద్ధుల బాధలు చూసి చలించారు. వారికి ఆసరాగా నిలిచే పరికరాలను ఆవిష్కరించాలని లోతుగా ఆలోచించారు.. చివరికి సాధించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గం టీహబ్లో టీఎస్ఐసీ (తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్).. వృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా, బాలల అభివృద్ధి శాఖ, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలతో కలిసి శనివారం తెలంగాణ సహాయక సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించింది. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ హాజరై ఆవిష్కర్తలకు బహుమతులు అందించారు. ఇందులో విద్యార్థులు, యువత శోధించి రూపొందించిన 39 ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఉత్తమ పల్లె సృజన అవార్డు కింద శివకుమార్ మోధా ఆవిష్కరించిన చేనేత యంత్రానికి అవార్డు దక్కింది. ఉత్తమ ఆవిష్కరణ సంస్థగా స్టార్టూన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిలిచింది. ఉత్తమ విద్యార్థుల ఆవిష్కరణగా స్మార్ట్ బ్యాండేజ్ నిలిచాయి. దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ డైరెక్టర్ డి.శైలజ, టీవీసీసీ ఛైర్మెన్ వాసుదేవరెడ్డి, టీఎస్ఐసీ సీఐవో డాక్టర్ శాంతా తౌతం పాల్గొన్నారు.
వృద్ధులకు ఊతకర్ర, ప్రత్యేక మరుగుదొడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా, దమ్మన్నపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన 8వ తరగతి విద్యార్థినులు మెర్సి రాణి, నందు కలిసి వృద్ధులకు ఉపయోగపడే ఊతకర్ర కం ప్రత్యేక మరుగుదొడ్డి(వెస్టర్న్ టాయిలెట్)ను ఆవిష్కరించారు. నందు నాన్నమ్మ కింద పడిన ఘటనకు చలించి తోటి విద్యార్థిని మెర్సీతో కలిసి ఊత కర్ర, దానికి కుర్చీని అమర్చారు. బహిర్భూమికి వెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది. పట్టుతప్పి కింద పడితే అలారం మోగేలా చేశారు.
స్మార్ట్ బ్యాండేజ్
జనగామ జిల్లా, దేవరుప్పల.. బాలయేసు హైస్కూల్ విద్యార్థినులు ఆరాధ్య లక్కీ, స్నేహిత స్మార్ట్ బ్యాండేజ్ను ఆవిష్కరించారు. ప్రమాదాలు జరిగినపుడు, మధుమేహగ్రస్థులు గాయపడితే గాయాలకు రోజూ డ్రెసింగ్ చేయాల్సి ఉంటుంది. పైపులు, మోటర్లు ఉపయోగించి గాయాలకు వేడి గాలి, చల్లగాలి తగిలే ఏర్పాటు చేశారు. తగిలిన గాలి వెలుపలికి వెళ్లేలా పైపులూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ పైపుల ద్వారా చేరి గాయాన్ని శుభ్రపర్చి మలినాలను మరో పైపు నుంచి బయటికి పంపేలా చేశారు.
కళ్లతో నడిపే కంప్యూటర్ మౌస్
మెదక్ నర్సాపూర్ బీవీఆర్ఐటీలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి సేవంత్ గాజుల.. కళ్లతో నియంత్రించే కంప్యూటర్ మౌస్ను రూపొందించాడు. ఇందుకు ప్రత్యేక యాప్ను ’రూపొందించాడు. యాప్ను నిక్షిప్తం చేసుకునే ల్యాప్టాప్, కంప్యూటర్లలో కెమెరా తప్పనిసరి (కెమెరా లేని కంప్యూటర్కు వెబ్ కెమెరా అమర్చుకోవాల్సి ఉంటుంది). కంప్యూటర్ ముందు కూర్చునే వ్యక్తి కళ్లను కెమెరా తొలుత స్కాన్ చేసుకుంటుంది. ఆ తెరను చూస్తూ శరీరాన్ని ఎటు కదిలిస్తే అటు తెరపై కర్సర్ కదులుతుంది. తెరపై అవసరమైన ఐకాన్, విండోలపైకి కర్సర్ను తీసుకెళ్లి కళ్లు అర్పితే క్లిక్ అయి ఐకాన్ ఓపెన్, క్లోజ్ అవుతుంది.
బ్రెయిలీ లిపి లర్నర్.. క్వర్టీ కీ బోర్డు
బీవీఆర్ఐటీకే చెందిన సూర్యతేజ, జాయ్ అంధులకు బ్రెయిలీ లిపీ క్వర్టీ కీ బోర్డును ఆవిష్కరించారు. దానికి వాయిస్తో కూడిన కీ బోర్డు వారికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. ఏ అక్షరం మీట నొక్కితే ఆ అక్షరం శబ్దం స్పీకర్లో వినిపిస్తుంది. అంతేకాక దానికి అనుసంధానించే ఉండే యాప్ను డౌన్లోడ్ చేసుకునే చరవాణిలో కూడా అక్షరాలు నొక్కినప్పుడు శబ్దం వినిపిస్తుంది. ఒక్కో విద్యార్థికి వ్యక్తిగతంగా కాక యాప్ ద్వారా చరవాణి, కంప్యూటర్ సహకారంతో అనేక మంది విద్యార్థులకు ఒకేసారి అక్షరాభ్యాసం చేయించే వీలు ఉంటుంది.
టచ్మీ నాట్ జాకెట్
బీఆర్ ఐటీకే చెందిన పుప్రియ, రక్షిత, ఖ్యాతి అనే విద్యార్థినులు సెన్సార్లు ఉపయోగించి టచ్ మీ నాట్ పేరుతో జాకెట్ను రూపొందించారు. బుద్ధిమాంద్యం, దివ్యాంగులైన యువతులను దృష్టిలో ఆ జాకెట్ను తెచ్చారు. జాకెట్ ధరించిన వారి శరీర భాగాలను ఎవరైనా తాకితే వెంటనే జాకెట్లో ఉండే అలారం మోగుతుంది. సమీపంలో ఉండే ప్రజలు చేరుకుని వారిని రక్షించే వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు