శాకాహారం బదులు.. మాంసాహారం
పనీర్ బర్గర్ ఆర్డర్ ఇస్తే చికెన్ బర్గర్ను ఇంటికి పంపి మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ నమోదైన కేసులో జొమాటోను వినియోగదారుల కమిషన్-3 తప్పుపట్టింది.
పరిహారం చెల్లించాలని జొమాటోకు వినియోగదారుల కమిషన్ తీర్పు
ఈనాడు, హైదరాబాద్: పనీర్ బర్గర్ ఆర్డర్ ఇస్తే చికెన్ బర్గర్ను ఇంటికి పంపి మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ నమోదైన కేసులో జొమాటోను వినియోగదారుల కమిషన్-3 తప్పుపట్టింది. ఫిర్యాదీకి రూ.5 వేలు, కేసు ఖర్చులు రూ.1,000తోపాటు రూ.202.50 రిఫండ్ చేయాలని ఆదేశించింది. అంబర్పేట్కు చెందిన దీపక్కుమార్ సంగ్వాన్ జొమాటోలో కొత్తపేటలోని కార్నర్ బేకర్స్లో పనీర్ బర్గర్, కోక్ ఆర్డర్ ఇచ్చారు. డెలివరీ బాయ్ చికెన్ బర్గర్ తీసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివాద సంస్థ రూ.500 చెల్లిస్తామని తెలిపింది. సంతృప్తి చెందని ఫిర్యాదీ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
* బీమా క్లెయిమ్ చెల్లించకుండా ఇబ్బంది పెట్టిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్పై హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతి చెందిన తన భర్త ప్రతివాద సంస్థలో పాలసీదారుడని పరిహారం ఇప్పించాలంటూ రాజేంద్రనగర్కు చెందిన శిల్ప బన్సల్ కమిషన్ను ఆశ్రయించారు. ఫిర్యాదీకి రూ.54 లక్షలు, 9 శాతం వడ్డీతో, రూ.20 వేలు పరిహారం 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
* ఐటీ సేవల్లో లోపాలకు గాను 3డైమెన్షన్స్ ఐటీ సర్వీసెస్ ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్కు రూ.2,07,000, 12 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని, రూ.25 వేలు పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చులు ఇవ్వాలని ఆదేశించింది.
* నిబంధనలకు విరుద్ధంగా 10 శాతం సర్వీస్ ఛార్జీ వసూలు చేసిన బ్రాడ్వే ది బ్రెవెరీ రెస్టారెంట్ కొత్తపేటకు చెందిన కె.వెంకటేశ్కు రూ.10వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.5 వేలు చెల్లించడంతోపాటు రూ.521 రిఫండ్ చేయాలని కమిషన్ ఆదేశించింది.
* తప్పుడు ఫలితాలు ఇచ్చి ఫిర్యాదీ మానసిక వేదనకు కారణమైన పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్ లిమిటెడ్కు వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. ముషీరాబాద్కు చెందిన పి.నాగార్జునరెడ్డికి రూ.60 వేలు చెల్లించాలని ప్రతివాద సంస్థకు స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!