లింకు రోడ్ల నిర్మాణానికి జంకు
గ్రేటర్ చుట్టూ శివారుల్లో తలపెట్టిన రోడ్ల విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పనులు చేపట్టిన హెచ్ఆర్డీసీఎల్(హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ) వద్ద నిధుల్లేవు.
ఆ పనులు మాకొద్దంటున్న గుత్తేదారులు
నిధుల్లేకపోవడమే సమస్య
జవహర్నగర్ చెన్నాపురం చౌరస్తా నుంచి ఆర్మీ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రోడ్డు దుస్థితి
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్ చుట్టూ శివారుల్లో తలపెట్టిన రోడ్ల విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పనులు చేపట్టిన హెచ్ఆర్డీసీఎల్(హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ) వద్ద నిధుల్లేవు. బ్యాంకుల నుంచి అప్పు లభించట్లేదు. విషయం గుత్తేదారుల వరకూ వెళ్లింది. టెండర్లలో పాల్గొనేందుకు ముఖం చాటేశారు. మూడుసార్లు టెండరు నోటిఫికేషన్ ఇచ్చినా స్పందన కరవైంది. నెలల తరబడి ఇదే వరుస. లింకు రోడ్లు, రహదారుల విస్తరణే లక్ష్యంగా రెండేళ్ల క్రితం హెచ్ఆర్డీసీఎల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ నిధులతో గ్రేటర్లో ఇప్పటికే రెండు దశల్లో పనులు మొదలై.. విజయవంతంగా సాగుతున్నాయి. మూడో దశలో నగర శివారుల్లోని పది పురపాలక సంస్థల పరిధిలోనూ అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది జులై 31న ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.1,500 కోట్లతో 120.92 కి.మీ. పొడవున హెచ్ఆర్డీసీఎల్ పనులకు శ్రీకారం చుట్టినా నిధుల లేమితో అడుగు కూడా ముందుకు పడడంలేదు. బ్యాంకు రుణం మంజూరు కాకపోవడంతో సమస్య తలెత్తిందని, టెండర్లను వాయిదా వేస్తున్నామని ఇంజినీర్లు వివరణ ఇచ్చారు. శివారు మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటి పరిధిలో చేపట్టే పనుల వ్యయాన్ని భరించాలంటూ ప్రభుత్వం హెచ్ఎండీఏను ఆదేశించింది. హెచ్ఎండీఏ కొన్ని నెలలుగా రుణం కోసం విఫలయత్నం చేస్తోంది.
మేడ్చల్ నియోజకవర్గంలో.. మేడ్చల్ నియోజకవర్గంలో 13 రోడ్లను రూ.417 కోట్లతో 33.5 కి.మీ. పొడవున అభివృద్ధి చేయాలని హెచ్ఆర్డీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జవహర్నగర్ కార్పొరేషన్లోని రోడ్లు ముఖ్యమైనవి. చెన్నాపురం చౌరస్తా నుంచి దమ్మాయిగూడ, డంపింగ్యార్డు, ఫైరింగ్ రేంజ్, ఒంపుగూడ ప్రాంతాల మధ్య రోడ్డు విస్తరణ పనులు 2003 నుంచి వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు.. నిధుల సమస్య అడ్డంకిగా మారింది.
ఐదు ప్యాజీలుగా..
* ప్యాకేజీ-1: శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలో రూ.304 కోట్లతో 25.2 కి.మీ. పొడవైన 7 లింకు రోడ్లు
* ప్యాకేజీ-2: బడంగ్పేట, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీలో రూ.330 కోట్లతో 27.2 కి.మీ. పొడవైన 10 రహదారులు
* ప్యాకేజీ-3: జవహర్నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలో రూ.417 కోట్లతో 33.35 కి.మీ.
పొడవున 13 రోడ్లు
* ప్యాకేజీ-4: బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీలోని రూ.297 కోట్లు 24.64 కి.మీ. పొడవున 11 రహదారులు.
* ప్యాకేజీ-5: బండ్లగూడ జాగీర్, జీహెచ్ఎంసీలో రూ.152 కోట్లతో 10.53 కి.మీ. పొడవైన 9 లింకు రోడ్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు