సంక్షిప్త వార్తలు
ఉస్మానియా వర్సిటీలోని విద్యాకళాశాల వద్ద గల వారసత్వ బావిని పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్లో హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ను ఆదేశించారు.
ఓయూలోని వారసత్వ బావిని పునరుద్ధరిస్తాం: మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలోని విద్యాకళాశాల వద్ద గల వారసత్వ బావిని పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్లో హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ను ఆదేశించారు. వర్సిటీ విద్యాకళాశాల విద్యార్థి ఒకరు కేటీఆర్కు ట్విటర్లో ఈ బావి దుస్థితిని తెలియజేస్తూ బాగు చేయాలని కోరారు. మంత్రి వెంటనే స్పందిస్తూ ఉస్మానియా ఉపకులపతిని సంప్రదించి వెంటనే పనులు చేపట్టాలని కమిషనర్కు సూచించారు.
నుమాయిష్ వచ్చే నెలే!
అబిడ్స్, న్యూస్టుడే: కొవిడ్ అనంతరం పూర్తి స్థాయిలో ‘నుమాయిష్’ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(ఎగ్జిబిషన్)ను నుమాయిష్ పేరుతో 1938 నుంచి నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కొవిడ్తో 2021లో నిర్వహించలేదు. 2022లో జనవరి 1న ప్రారంభించి రెండో రోజునే నిలిపి వేయగా, ఫిబ్రవరి 25న తిరిగి ప్రారంభించి ఏప్రిల్ 14వ తేదీ వరకు కొనసాగించారు. ఈసారి మాత్రం 46 రోజుల పాటు నిర్ణీత సమయంలో నిర్వహించేందుకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టడంలో ఎగ్జిబిషన్ సొసైటీ నిమగ్నమైంది.
అభివృద్ధిపై దృష్టి సారించాలి
అంబర్పేట, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు మానుకుని అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని తెలంగాణ, ఏపీ బ్రాహ్మణ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్శర్మ కోరారు. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మానుకోవాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను తితిదే బోర్డులో నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అన్యమత ఉద్యోగులను తొలగించాలని కోరారు. నిరంజన్కుమార్ దేశాయ్, మంగపతిరావు, శ్రీనివాస్రెడ్డి, ఫారూక్పాషా పాల్గొన్నారు.
శుభకార్యాల సందడి మొదలు
ఈనాడు, హైదరాబాద్: ఆదివారం నగరంలో శుభకార్యాలు ఎక్కువ ఉండడంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. మరీ ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు ఎక్కువగా ఉన్న దారులన్నీ ట్రాఫిక్ జామ్లయ్యాయి. కర్మన్ఘాట్, ఎల్బీనగర్, శంషాబాద్, నర్సాపూర్, బోయినపల్లి, నాగోల్, అల్కాపురి కాలనీ చౌరస్తా, బీఎన్రెడ్డినగర్, హస్తినాపురం, ఆరాంఘర్ చౌరస్తా, మియాపూర్ చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు దాటడానికి అరగంట పట్టింది. చాలారోజుల తర్వాత మంచి ముహూర్తాలు మొదలుకావడం, అదీ సెలవుదినం ఆదివారం అవ్వడంతో నగరవాసులంతా ఫంక్షన్హాల్స్ బాటపట్టారు.
ఉత్సాహంగా రాకథాన్
గోల్కొండ, న్యూస్టుడే: సొసైటీ టూ సేవ్ రాక్స్ అండ్ గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లు సంయుక్తంగా ఆదివారం తారామతి-బారాదరి వద్ద ఉన్న ఘర్ ఏ ముబారక్ వద్ద నిర్వహించిన 9వ హైదరాబాద్ రాకథాన్ ఉత్సాహభరితంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ మాట్లాడుతూ చారిత్రక రాక్లతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సొసైటీ టూ సేవ్ రాక్స్ అధ్యక్షురాలు ఫాతిమా అలీఖాన్, గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ అధ్యక్షుడు మణిదీప్ పాల్గొన్నారు.
పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి: పిడమర్తి
సికింద్రాబాద్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన మేరకు నూతన పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కేంద్రప్రభుత్వాన్ని డిమాండు చేశారు. దీంతోపాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో చలో దిల్లీ గోడపత్రిక విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పిడమర్తి రవి హాజరై గోడ పత్రిక ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలేటి శ్రీశైలం, గాదె వెంకట, మొగులయ్య, వెంకటేష్, ప్రసాద్, సాయన్న పాల్గొన్నారు.
హకీంపేటకు చేరిన ఫ్లయింగ్ ఎక్స్పెడిషన్
ఈనాడు, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ది ఆర్మీ సర్వీస్ కార్ప్స్ 11వ రీయూనియన్ వేడుకల్లో భాగంగా ఆర్మీ మైక్రోలైట్ ఫ్లయింగ్ ఎక్స్పెడిషన్ బృందం ఆదివారం హకీంపేటకు చేరుకుంది. నవంబర్ 30న ప్రారంభం కాగా.. 17 రోజుల్లో నాలుగు విమానాలు, 5 వేల కిలోమీటర్ల ఏరియల్ దూరం కంటే ఎక్కువగా ప్రయాణించే లక్ష్యంతో ఈ సాహస బృందం వేర్వేరు ప్రదేశాలను సందర్శిస్తోంది. గయాకు చెందిన ఆర్మీ అడ్వెంచర్ నోడల్ సెంటర్ (మైక్రోలైట్) ఆర్మీ అడ్వంచర్ వింగ్ ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తున్నారు. బృందంలో బృంద నేత కల్నల్ ఎల్.కె.యాదవ్, కల్నల్ రాహుల్, లెఫ్టనెంట్ కల్నల్ బీపీ సింగ్, హెచ్సీ జోషి, రాప్ కేశ్, సోరెన్, ధర్మేంద్ర, సుర్వే, ఎన్.కె.ప్రదీప్, ఎన్.కె.విజయ్కుమార్ యాదవ్, సుబేదార్ వినోద్కుమార్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే