logo

నిధుల మంజూరు ఒట్టి మాటే: భాజపా

నియోజక వర్గాలకు నిధుల మంజూరు ఒట్టి మాటే అని జిల్లా భాజపా అధ్యక్షుడు సదానందరెడ్డి విమర్శించారు. తాండూరులోని భాజపా కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Published : 06 Dec 2022 02:19 IST

మాట్లాడుతున్న జిల్లా భాజపా  అధ్యక్షుడు సదానందరెడ్డి

తాండూరు: నియోజక వర్గాలకు నిధుల మంజూరు ఒట్టి మాటే అని జిల్లా భాజపా అధ్యక్షుడు సదానందరెడ్డి విమర్శించారు. తాండూరులోని భాజపా కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించడానికే నిధులు మంజూరు మాటలు మాట్లాడతారన్నారు. తాండూరు నియోజక వర్గానికి రూ.134 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని చెప్పారు. సమావేశంలో జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ కుమార్‌, మాజీ మంత్రి చందుమహరాజ్‌ తనయుడు ఎం.నరేష్‌, రాష్ట్ర మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు లలిత, తాండూరు నియోజక వర్గం ఇన్‌ఛార్జి రజనీకాంత్‌, జిల్లా మాజీ గ్రంథాలయ ఛైర్మన్‌ మురళీ కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని