logo

అభివృద్ధికి ఎన్ని నిధులైనా తెస్తా: ఎమ్మెల్యే

ఎన్ని నిధులైనా తెచ్చి తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. 

Published : 06 Dec 2022 02:19 IST

చరవాణిలో అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్ని నిధులైనా తెచ్చి తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు.  ముఖ్యమంత్రి సహకారంతో తాండూరు ప్రజలకు న్యాయం చేయాలనుకున్నానని తెలిపారు. పల్లెపల్లెకు పైలెట్‌ కార్యక్రమంలో భాగంగా బషీరాబాద్‌ మండలం నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మైల్వార్‌, మైల్వార్‌ తండా, ఎక్మాయి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రామునాయక్‌, నర్సిరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని