అర్ధరాత్రి రోడ్డెక్కాలంటే వణుకు
రెండు నెలలక్రితం మలక్పేట్ వద్ద అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువవైద్యురాలు మరణించింది.
పోకిరీ గ్యాంగ్ల హల్చల్తో సామాన్యుల బెంబేలు
రహదారి మధ్య ఆకతాయి ముఠాల హల్చల్
ఈనాడు, హైదరాబాద్-మాదన్నపేట, న్యూస్టుడే: రెండు నెలలక్రితం మలక్పేట్ వద్ద అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువవైద్యురాలు మరణించింది.ఇదే ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన యువకుడు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఎస్సైతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనల్లో నిందితులు ఎవరనేది వెల్లడించేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కించారు.
ఆధిపత్యం.. లైకుల కోసం
నగర శివారు, పాతబస్తీ ప్రాంతాల్లో కొంతమంది యువకులు ‘మాయాగ్యాంగ్’లుగా మారి సెల్ఫోన్, చైన్స్నాచింగ్, పిక్పాకెటింగ్కు పాల్పడుతున్నారు. కళాశాలల్లో విద్యార్థుల మధ్య గొడవల్లో పాల్గొంటున్నారు. ఆధిపత్యం సాధించేందుకు కత్తులు, తల్వార్లు, మద్యం సీసాలతో దాడులకు తెగబడుతున్నారు. అర్ధరాత్రి దాటాక హోటళ్లు, పాన్దుకాణాల వద్ద చేరుతున్నారు. నంబరు ప్లేటు లేని కార్లు, బైక్లతో బీభత్సం సృష్టిస్తున్నారు. ర్యాష్డ్రైవింగ్తో దారెంట వెళ్లే ప్రయాణికులను వణికిస్తున్నారు. తాజాగా సంతోష్నగర్ ఠాణా పరిధిలో రహదారులపై కత్తులు, బీరు సీసాలతో బైక్లపై హల్చల్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వాటిల్లో లైక్, షేరింగ్ల కోసమే మైనర్లు ముఠాలుగా మారి పోటీ పడుతున్నట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
తెల్లవార్లూ వీధుల్లోనే
పాతబస్తీ పలు కాలనీల్లో అధికశాతం యువకులు రాత్రయితే వీధుల్లోకి చేరతారు. మద్యం తాగుతూ వేడుకలు చేసుకుంటుంటారు. రాత్రి గస్తీలోనూ కొన్ని ఠాణాల పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆయా గ్యాంగ్లు తెల్లవార్లూ చెలరేగుతున్నాయి. చార్మినార్, హుస్సేనిఆలం, బహదూర్పుర ఠాణాల పరిధిలో దారెంట ఒంటరిగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు, పాదచారులను లక్ష్యం చేసుకొని దొంగలు, పాత నేరస్థులు చోరీలకు దిగుతున్నారు. బాధితుల్లో కొద్దిమంది మాత్రమే ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు.
ఇవిగో ఉదాహరణలు
* నవంబర్ 27న సంతోష్నగర్ రహదారిపై చేతుల్లో మందు బాటిళ్లు, బొమ్మ తుపాకులతో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసిన మాయాముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా పాతనేరస్థులే.
* ఏప్రిల్లో డబీర్పురా, చంచల్గూడ రహదారులపై తెల్లవారుజామున బైక్ రేసింగ్లతో భయభ్రాంతులకు గురిచేసిన వారిలో అధికశాతం విద్యార్థులే. చాదర్ఘాట్ పెట్రోలింగ్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
* చంచల్గూడలో అర్ధరాత్రి తల్వార్లతో బర్త్డే కేక్ కోసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!