తూచ్.. చెరువు కాదది.. సెల్లారు గుంత
అసలు విషయం తెలియక ఏకంగా మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదుతో సోమవారం అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది.
చెరువు ఉన్నట్లు చూపుతున్న గూగుల్ చిత్రం
ఈనాడు, హైదరాబాద్: అసలు విషయం తెలియక ఏకంగా మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదుతో సోమవారం అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. చెరువుకు, పూడ్చిన సెల్లారు గుంతకు తేడా తెలియని ఓ నెటిజన్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. వివరాలివీ.. కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లోని ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉండే చెరువు కనిపించడం లేదంటూ కేటీఆర్కు ట్విట్టర్లో ఓ నెటిజన్ ఫిర్యాదు చేయగానే మంత్రి వెంటనే స్పందించారు. గతంలో అక్కడ చెరువు ఉన్నట్లు, ఇప్పుడు పూడ్చినట్లు తెలిపే గూగుల్ పటాలతో ఫిర్యాదు రాగానే నిజమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారులను, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జడ్సీ మమత సర్కిల్ కమిషనర్తో తనిఖీ చేయించగా అసలు విషయం వెల్లడైంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ.. గతంలో చేపట్టిన ప్రాజెక్టుకోసం ఆర్టీఓ కార్యాలయం వెనుక సెల్లారు తవ్వారు. ప్రాజెక్టు రద్దయి సెల్లారులో నీరు చేరి చుట్టుపక్కల కాలనీ పిల్లలు కొందరు అందులో పడి చనిపోయారు. దీంతో ఆ సెల్లారుగుంతను పూడ్చేశారు. ఇదే విషయాన్ని మంత్రికి విన్నవించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది.
ప్రస్తుతమిలా.. సెల్లార్ గుంత పూడ్చివేసిన తరువాత
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yuvagalam: యువగళం పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
-
Sports News
Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్..
-
India News
Pariksha Pe Charcha: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’
-
Movies News
Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత
-
World News
Elon Musk: కాలేజ్కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..!
-
Politics News
Yuvagalam: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం