Telangana News: వైద్యారోగ్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

వైద్యారోగ్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈమేరకు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Updated : 20 Dec 2022 13:24 IST

హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈమేరకు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్యవిద్యాశాఖ సంచాలకుల పరిధిలో మొత్తం 34 విభాగాల్లో  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన వారు ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5గా నిర్ణయించారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని