అవుటర్ లీజుపై ముందుకు!
మహానగరానికి మణిహారం లాంటి అవుటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంపై హెచ్ఎండీఏ కసరత్తు ముమ్మరం చేసింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆర్ఎఫ్పీ కోసం టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ
ఈనాడు, హైదరాబాద్
మహానగరానికి మణిహారం లాంటి అవుటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంపై హెచ్ఎండీఏ కసరత్తు ముమ్మరం చేసింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీవోటీ విధానాల రూపకల్పన, లాభదాయక నమూనాను సూచించడానికి లావాదేవీల సలహాదారు (ట్రాన్స్క్షన్ అడ్వయిజర్)ను నియమించేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను మూడు నెలల క్రితం ఆహ్వానించింది. గడువులోపు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. తాజాగా నానక్రాంగూడలోని అవుటర్ రింగ్రోడ్డు కార్యాలయంలో ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపారు. లీజుకు ఇవ్వనున్న దృష్ట్యా హెచ్ఎండీఏ ప్రతిపాదనలకు అనుగుణంగా నిబంధనలు, ఇతర అంశాలు ఉండేలా ఆర్ఎఫ్పీ రూపకల్పనకు వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. సదరు సంస్థలు కూడా తమ ప్రతిపాదనలను అధికారుల ముందు ఉంచాయి. సాంకేతిక, ఆర్థిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థను ట్రాన్స్క్షన్ అడ్వయిజర్గా నియమించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 21 సాంకేతిక బిడ్లను తెరవనున్నారు.
* ప్రస్తుతం అవుటర్ రింగ్ నిర్వహణ హెచ్ఎండీఏ చూస్తోంది. వాహనాల నుంచి టోల్ను ప్రైవేటు సంస్థలు వసూలు చేసి..హెచ్ఎండీఏకు చెల్లిస్తున్నాయి. లీజు తర్వాత అవుటర్ నిర్వహణ నుంచి టోల్ వసూళ్లు అన్నీ.. ఇక ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లనుంది. నిర్ణీత లీజు మొత్తం హెచ్ఎండీఏకు చెల్లించనుంది. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను బీవోటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో నిర్వహిస్తున్నాయి. ఆయా రహదారులపై టోల్ వసూళ్ల నుంచి నిర్వహణ వరకు ఆయా సంస్థలే చూస్తున్నారు. ఒప్పందంలో భాగంగా ముందే ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డును టీవోటీ పద్ధతిలో నిర్వహించడానికి ఇప్పటికే నిర్ణయించారు.
* నగరం చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్లు మేరకు నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానమై ఉన్నాయి. అవుటర్ రింగ్రోడ్డుపై నిత్యం 1.70 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు 2019లో హెచ్ఎండీఏ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈగల్ ఇన్ఫ్రా అనే సంస్థకు టోల్ వ్యవస్థ కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.421 కోట్లు వరకు ఆదాయం సమకూరింది. ఆ లెక్కన 30 ఏళ్లపాటు ఏటా కొంత శాతం పెంపుతో లీజుకు ఇవ్వనున్నారు.
30 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు
* అవుటర్ను హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్(హెచ్జీఎల్) నిర్వహిస్తోంది. 159 కిలోమీటర్ల పొడవునా విద్యుత్తు లైట్లు, ఇంటర్ ఛేంజ్లు, సర్వీసు రహదారుల నిర్వహణ, భద్రత చూస్తోంది.
* లీజుకు ఇవ్వడంతో సదరు సంస్థే 30 ఏళ్లపాటు నిర్వహించనుంది. పర్యవేక్షణకే హెచ్జీఎల్ పరిమితం అవుతుంది. టీవోటీ విధానంలో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా టోల్ ఆదాయాన్ని విడలత వారీగా కాకుండా ముందస్తుగానే ప్రభుత్వానికి అందించనుంది. ఇలా ఒకేసారి రూ.4-5 వేల కోట్లు ప్రభుత్వానికి చేరనుంది.
*ఈ భారీ మొత్తంతో ఏదైనా మౌలిక వసతుల ప్రాజెక్టులకు చేపట్టడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఏర్పడుతుంది. టీవోటీ కింద లీజు దక్కించుకున్న సంస్థ రోడ్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చూడాల్సి ఉంటుంది.
* ఇంటర్ ఛేంజ్లు, సర్వీసు ఇతర ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార కూడళ్లను అభివృద్ధి చేసి ఆదాయ సముపార్జన ఇతరత్రా రెవెన్యూను పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో అవుటర్ ప్రభుత్వానికి బంగారుబాతుగా మారునుంది.
*మరోవైపు లీజు పేరుతో హెచ్ఎండీఏ ప్రైవేటు సంస్థలకు ధారదత్తం చేస్తోందనే విమర్శలు లేకపోలేవు. అధికారులు ఈ విమర్శల్ని కొట్టి పారేస్తున్నారు. అదే మేలని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై