ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.100 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరే ఎంఎంటీఎస్ రెండో దశకు నిధులు అందజేసింది. తన వాటా మొత్తం ఇవ్వకపోయినా, రూ.100 కోట్లు రైల్వేకు రెండు రోజుల కిందట అందాయి.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరే ఎంఎంటీఎస్ రెండో దశకు నిధులు అందజేసింది. తన వాటా మొత్తం ఇవ్వకపోయినా, రూ.100 కోట్లు రైల్వేకు రెండు రోజుల కిందట అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రైల్వేకు అందిన నిధుల మొత్తం రూ. 279 కోట్లకు చేరినట్టయింది. ఇటీవల పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎంఎంటీఎస్ రెండోదశకు రూ.200కోట్లు ఇస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం విదితమే. 2012-13లో ఎంఎంటీఎస్ రెండోదశ అంచనాలు రూ.816 కోట్లు ఉండగా.. ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఆలస్యంతో ప్రస్తుతం రూ.1150 కోట్లకు చేరిందని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంకా రూ.487 కోట్లు అందాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి అందిన రూ.100 కోట్లతో ఇప్పటికే సిద్ధమైన మార్గాల్లో ఎంఎంటీఎస్లు నడుపుతారా.. పనులు మొత్తం పూర్తి చేయడంపై దృష్టి పెడతారా.. అనేది రైల్వే స్పష్టం చేయాల్సిఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్కు భారత్ నోటీసు
-
Politics News
Yuvagalam: యువగళం పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
-
Sports News
Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్..
-
India News
Pariksha Pe Charcha: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’
-
Movies News
Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత
-
World News
Elon Musk: కాలేజ్కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..!