వెళ్లొస్తానంటూ.. అనంత లోకాలకు..
ఆర్టీసీ అద్దె బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెల్లెలు మృతి చెందగా.. అన్నకు తీవ్రగాయాలయ్యాయి.
బస్సు ఢీకొని బాలిక మృతి, సోదరుడికి గాయాలు
అనూష
బషీరాబాద్, న్యూస్టుడే: ఆర్టీసీ అద్దె బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెల్లెలు మృతి చెందగా.. అన్నకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బషీరాబాద్ ఠాణా పరిధిలోని నవల్గా పెట్రోల్ బంక్ ఎదురుగా చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...మండలంలోని నవల్గాకు చెందిన కొత్త రాములు, అమృతమ్మ దంపతులు వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు శ్రీనివాస్, అనూష (11), లక్ష్మీ, శ్రీలత ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ పదోతరగతి పూర్తి చేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయ పడుతున్నాడు. బుధవారం ఉదయం కుసుమ పంటకు మందు పిచికారీ చేసేందుకు అవసరమైన పెట్రోల్ తీసుకురావడానికి నవల్గా సమీపంలోని బంక్కు శ్రీనివాస్ బయలుదేరాడు. అదే సమయంలో అనూష కూడా పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. తన ద్విచక్ర వాహనం వెంట కూర్చోబెట్టుకొని అతను బయలుదేరాడు. పాఠశాల వద్దకు రాగానే చెల్లెలును దించే ప్రయత్నం చేయగా.. పెట్రోల్ బంక్ వద్దకు తాను వస్తాననడంతో వెంటతీసుకెళ్లాడు. తాండూరు-బషీరాబాద్ ప్రధాన మార్గంలోని నవల్గా గేటు సమీపంలో కుడి వైపున ఉన్న బంక్లోకి ద్విచక్ర వాహనాన్ని మలుపుతుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. అనూష తల భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాస్కు కాలు, చేయికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.
తీవ్రగాయాలైన శ్రీనివాస్ను ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు
నాలుగు గంటల పాటు రోడ్డుపైనే నిరసన
తన కూతురు మృతి చెందిందన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్నారు. సీఐ రాంబాబు, ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి డీఎస్పీ శేఖర్గౌడ్తో కుటుంబీకులను మాట్లాడించారు. కేసు విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, మీకు న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కుటుంబీకులు శాంతించారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్, కన్వీనర్ రజనీకాంత్, గ్రామ సర్పంచి లాలప్ప నిరసనలో మద్దతు తెలిపి కుటుంబానికి రూ.15లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తాండూరు-బషీరాబాద్ ప్రధాన దారిలో నిరసన తెలుపుతూ...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్