ఉద్యోగాల గడ్డగా మార్చడమే ధ్యేయం
12 ఏళ్ల తర్వాత ఫీజులు పెంచాం. ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇస్తున్నందున విద్యార్థులపై భారం పడదు.
12 ఏళ్ల తర్వాత ఫీజులు పెంచాం. ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇస్తున్నందున విద్యార్థులపై భారం పడదు.
విద్య.. పరిశోధన.. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొ.డి.రవీందర్ తెలిపారు. విద్యార్థులు, ఆచార్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఓయూ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. వివాదాస్పద నిర్ణయాలు.. ఫీజుల పెంపు.. ఇలా వివిధ అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో మాట్లాడారు.
ఈనాడు: వీసీగా ఏడాదిన్నర కాలంలో వర్సిటీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
వీసీ: ఓయూకు ఉన్న ఘన చరిత్రను కాపాడటమే పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. వచ్చే 10-15 ఏళ్లకు తగ్గట్టుగా వర్సిటీ అభివృద్ధికి 21 పాయింట్ల అజెండా తీసుకొచ్చా. ఇందులో టీచింగ్-లెర్నింగ్, పరిశోధనలు, మౌలిక వసతుల అభివృద్ధి, అవుట్రీచ్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చా. ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే యూపీఈలో రెండింటిని ఏర్పాటు చేశాం. ఓయూ అంటే ఉద్యమాల గడ్డే కాదు ఉద్యోగాల గడ్డ అనేలా తీర్చిదిద్దుతున్నాం.
ఈనాడు: మీరు తీసుకున్న చాలా నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. కదా?
వీసీ: అందరితో చర్చించాకే నిర్ణయాలు తీసుకున్నా. ఒప్పంద ఆచార్యులకు బాండ్ పేపర్ విషయంలో వారిని సూటిగా ఒకటి అడుగుతున్నా.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఒప్పంద ఆచార్యులు అగ్రిమెంట్పై సంతకాలు చేశారా? లేదా?.. ఒకవేళ కాకపోతే నేను దేనికైనా సిద్ధమే. ఇది ఈసీ తీసుకున్న నిర్ణయం.
ఈనాడు: మీ నిర్ణయాలపై గవర్నర్కు ఫిర్యాదులు వెళ్లాయి. మెస్లు, హాస్టళ్ల విషయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి?
వీసీ: యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్లోనే క్రెడిట్స్ తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నాం. డీన్స్, అధిపతులతో పది సార్లు సమావేశాలు పెట్టాం. ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడుతూ ర్యాంకింగ్ల్లో ముందుండాలని తీసుకున్న నిర్ణయమిది. 2024లో న్యాక్కు వెళ్లాలంటే ఈ తరహా సంస్కరణలు అవసరం. హాస్టల్, మెస్ల డిపాజిట్ మేం కట్టమని.. హాస్టల్ మారమని చెప్పి వచ్చి కొందరు కావాలనే గొడవలు చేశారు.
ఈనాడు: 21 అంశాల అజెండాలో ఇంకా చాలా పనులు పెండింగులో ఉన్నాయన్న విమర్శ ఉంది?
వీసీ: గత ఏడాదిన్నరలో అందరి సహకారంతో 60 శాతం అంశాలు పట్టాలెక్కించాం. ఓయూలోకి వాహనాలు రాకుండా రోడ్డు నిర్మించనున్నాం.
ఈనాడు: పరిశోధనలలో ఓయూ వెనుకబడింది. ర్యాంకుల్లోనూ దిగజారుతోంది?
వీసీ: ఓయూలో పరిశోధనలు జరగడం లేదనే అపోహ ఉంది. దాన్ని తొలగించేందుకు పరిశోధనల్లో ముందున్న ఆచార్యులను ప్రోత్సహించేందుకు ‘ఉపకులపతి అవార్డు’ను దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చాం. ఇక్కడ పరిశోధనలను ల్యాబ్ టు ల్యాండ్ పేరిట సమాజానికి చేరవేస్తున్నాం. ఎన్ఐఆర్ఎఫ్లో 2021లో 32వ ర్యాంకు ఉండగా, ఈసారి 22వ స్థానానికి చేరుకున్నాం.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు ఓటు అడిగా నైతిక హక్కు లేదు: కేసీఆర్
[ 25-04-2024]
పదేళ్ల భాజపా పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో దిల్సుఖ్నగర్ నారాయణ విద్యార్థుల ప్రతిభ
[ 25-04-2024]
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో దిల్సుఖ్నగర్ నారాయణ డే డివిజన్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులతో సత్తా చాటారు. -
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా