ఓయూలో మరిన్ని వసతులు కల్పిస్తాం
విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు.
పరిపాలన భవన శంకుస్థాపనలో మంత్రి సబితారెడ్డి
శంకుస్థాపన చేస్తున్న మంత్రులు సబితారెడ్డి, మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు.
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నూతన సెంటినరీ పరిపాలనా భవనం నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఉపమేయర్ మోతె శ్రీలతారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి, ఓయూ వీసీ ప్రొ.రవీందర్లతో కలిసి సబితారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. నూతన భవనాన్ని 9 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఓయూలో మరో వసతిగృహం నిర్మిస్తామని తెలిపారు. మెరుగైన వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రొ.రవీందర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఓయూ శతాబ్ది పైలాన్, మరో వసతిగృహం నిర్మాణంతోపాటు బీ వసతిగృహం, ఆర్ట్స్ కళాశాల ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా : ప్రకాశ్రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి
-
Movies News
Remix Songs: ఆ‘పాత’ మధుర గీతాలు కొత్తగా.. అప్పుడలా.. ఇప్పుడిలా!
-
Sports News
IND vs AUS: క్రీజ్లో పాతుకుపోయిన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా స్కోరు 33/2 (15)
-
World News
Kim jong un: మళ్లీ కుమార్తెతో కనిపించిన కిమ్