logo

పాటతో దొరల గుండెల్లో గుబులు

బండెనక బండి కట్టి.. పాటను రాసి దొరల గుండెల్లో గుబులు రేపిన బండి యాదగిరి చిరస్మరణీయుడని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు.

Updated : 08 Dec 2022 05:21 IST

యాదగిరికి నివాళులర్పిస్తున్న వల్లీశ్వర్‌, రమణ, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా,
కళా జనార్దనమూర్తి, ఎస్‌బీ రామ్‌, శ్రీనివాస్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: బండెనక బండి కట్టి.. పాటను రాసి దొరల గుండెల్లో గుబులు రేపిన బండి యాదగిరి చిరస్మరణీయుడని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. బుధవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో ప్రముఖ సాహితీవేత్త బండి యాదగిరి జయంతి కార్యక్రమంలో శ్రీనివాస్‌గుప్తా ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బండెనక బండి పాట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. గానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని