Telangana News: టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారతీయ రాష్ట్ర సమితిగా (బీఆర్‌ఎస్‌)గా మార్పు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

Updated : 08 Dec 2022 18:10 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారతీయ రాష్ట్ర సమితిగా (బీఆర్‌ఎస్‌)గా మార్పు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గురువారం తెరాస అధినేత కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ అందింది. డిసెంబరు 9న మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం, జెండా ఆవిష్కరణ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని