logo

సంపులో పడి కన్నుమూసిన చిన్నారి

ఆడుకుంటున్న ఓ చిన్నారి సంపులో పడి దుర్మరణం పాలైన సంఘటన ఫరూక్‌నగర్‌ మండలం కందివనంలో చోటుచేసుకుంది.

Published : 09 Dec 2022 04:43 IST

భవ్యశ్రీ

షాద్‌నగర్‌: ఆడుకుంటున్న ఓ చిన్నారి సంపులో పడి దుర్మరణం పాలైన సంఘటన ఫరూక్‌నగర్‌ మండలం కందివనంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నాగేష్‌, పల్లవిల కూతురు భవ్యశ్రీ(4) గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకొంటూ అదృశ్యమైంది. పాప కోసం కుటుంబ సభ్యులు సుమారు 4 గంటల పాటు వెతికారు. సుమారు 12 గంటల ప్రాంతంలో పక్కింటిలోని సంపులో పాప మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు పాప నీటిలో పడి మృతి చెందిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని