logo

వదినపై కన్నేసిన మరిది

వదినను వివాహం చేసుకుంటానని వెంబడించాడు. వేధించాడు. నిరాకరించడంతో.. కత్తితో దాడికి తెగబడిన  ఘటన కేశంపేటలోని పీహెచ్‌సీలో గురువారం చోటుచేసుకుంది.

Published : 09 Dec 2022 04:43 IST

వివాహం వద్దన్నదని ఘాతుకం

కేశంపేట, న్యూస్‌టుడే: వదినను వివాహం చేసుకుంటానని వెంబడించాడు. వేధించాడు. నిరాకరించడంతో.. కత్తితో దాడికి తెగబడిన  ఘటన కేశంపేటలోని పీహెచ్‌సీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన యువతి(23) షాద్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ పీహెచ్‌సీలో పనిచేస్తోంది. ఆమె చెల్లిని ఆటోడ్రైవర్‌ సభావట్‌ కిషన్‌(35) ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య అక్కను పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం రాత్రి ఆమె ఆసుపత్రిలోనే పడుకుంది. గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలోకి వచ్చిన కిషన్‌ వదినపై కత్తితో దాడి చేశాడు. తోటి సిబ్బంది ఆమెను రక్షించారు. అతన్ని గదిలో బంధించి పోలీసులకు తెలిపారు. వారు వచ్చేలోపు అతడు పారిపోయాడు. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని