CM KCR: న్యూయార్క్, పారిస్, లండన్లో కరెంట్ పోవచ్చు.. హైదరాబాద్లో పోదు: కేసీఆర్
చరిత్రలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని చెప్పారు.
హైదరాబాద్: చరిత్రలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని చెప్పారు. హైదరాబాద్ మైండ్స్పేస్ వద్ద ఎయిర్పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘దేశ రాజధాని దిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో హైదరాబాద్ పెద్దది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చెన్నై, దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే విద్యుత్ వచ్చిన నగరం హైదరాబాద్. చెన్నైకు 1927లో వచ్చింది. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీ ఉన్న హైదరాబాద్.. అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకుని విశ్వనగరంగా ఉంది. ఈరోజు మెట్రో రైలు ఎయిర్పోర్టు కనెక్టవిటీ కోసం ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో కృషి చేసిన మున్సిపల్, హెచ్ఎండీఏ, జీఎంఆర్ ఎయిర్పోర్టు సిబ్బందిని అభినందిస్తున్నా.
భూగోళంపై సురక్షిత నగరం హైదరాబాద్..
చరిత్రలోనే కాదు.. వర్తమానంలోనూ హైదరాబాద్ చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలోనూ లేని అద్భుతమైన సమశీతోష్ణ వాతావరణం ఇక్కడ ఉంటుంది. భూకంపాలు రాకుండా భూగోళంపై సురక్షితంగా ఉండే సిటీ హైదరాబాద్. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో గతంలో నగరం గొప్పగా ముందుకు వెళ్లలేదు. సమగ్రత అనేది లేకుండా చాలా విషయాల్లో బాధలు అనుభవించాం. గతంలో హైదరాబాద్లోని ఏ బస్తీకి వెళ్లినా మంచినీటి కోసం భయంకరమైన బాధలు చూశాం. విద్యుత్ కోసం ధర్నాలు జరిగిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం. న్యూయార్క్, పారిస్, లండన్లో కరెంట్ పోవచ్చు కానీ.. హైదరాబాద్లో పోదు. మెట్రో రైళ్లలో రోజూ నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరం. పరిశ్రమల రంగంలో నగరం దూసుకెళ్తోంది. ఐటీ రంగంలో సుమారు 500 గొప్ప పరిశ్రమలు కొలువుదీరుతున్నాయి. ఎస్ఆర్డీపీ కింద పనులు చేపట్టి ట్రాఫిక్ కష్టాలు తీర్చుకుంటున్నాం. హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల