మరిచిపోకుండా.. మందుల సంచి
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్సీడీ (నాన్ కమ్యూనికెబుల్ డిసీసెస్) మందుల కిట్ను పంపిణీ చేస్తోంది.
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, బొంరాస్పేట్
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్సీడీ (నాన్ కమ్యూనికెబుల్ డిసీసెస్) మందుల కిట్ను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఇటీవల మంత్రి సబితారెడ్డి జిల్లాలో వీటి బాధితులకు ఇచ్చి ప్రారంభించారు. అసంక్రమిత వ్యాధులకు గురైన వారు సక్రమంగా మందులు వేసుకునే విధంగా సంచులను రూపొందించారు. జిల్లాలోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 22842 కిట్లను సరఫరా చేశారు. చక్కెర, రక్తపోటు, ఇతర వ్యాధులకు గురైనవారు వైద్యుల సూచన మేరకు మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పితే సమస్య జఠిలమవుతుంది. ఆ సమస్యలను అధిగమించేందుకు దీనిని రూపొందించారు. ఆరోగ్య కేంద్రాలకు నిత్యం వందల సంఖ్యలో వివిధ రుగ్మతలతో వస్తుంటారు. ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి నెలకు సరిపడా మందులు అందజేస్తారు. సంచిలోని మూడు అరల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవాల్సిన మందులు ఉంటాయి. తద్వారా మరిచిపోకుండా తీసుకునేందుకు ఉపకరిస్తుంది. ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన జాబితా ప్రకారం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు.
వారానికి ఒక సారి:
ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రతి మంగళవారం, గురువారం ఎన్సీడీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. రక్తపోటు, చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తూ అనుగుణంగా వైద్యం అందజేస్తున్నారు. నిత్యం వేసుకోవాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. గతంలో కూడా ఈ విధానంలో సరఫరా చేశారు.
ఇది నిరంతర ప్రక్రియ: డాక్టర్ పల్వన్కుమార్, జిల్లా వైద్యాధికారి
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కిట్లు పంపించాం. అవసరమున్న మేరకు దశల వారిగా పంపిణీ చేస్తుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. నెలకు సరిపడే మందులు ఉంటాయి. నెల తర్వాత రోగిని పరీక్షించి, ఆ పరిస్థితి ప్రకారం మాత్రలు వినియోగించాలని సూచిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు