అమెరికా నుంచి తిరిగొస్తూ.. అనంతలోకాలకు...
అమెరికాలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లి వస్తూ.. దిల్లీలో గుండె నొప్పితో తండ్రి హఠాన్మరణం చెందిన ఘటన ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధి ఆత్మకూర్(ఎం)కు చెందిన ఎస్.ప్రకాష్రావు జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు.
దిల్లీ విమానాశ్రయంలో హఠాన్మరణం
ప్రకాష్రావు
సైదాబాద్, న్యూస్టుడే: అమెరికాలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లి వస్తూ.. దిల్లీలో గుండె నొప్పితో తండ్రి హఠాన్మరణం చెందిన ఘటన ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధి ఆత్మకూర్(ఎం)కు చెందిన ఎస్.ప్రకాష్రావు జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. మూసారాంబాగ్-అంబర్పేట మార్గంలోని జ్ఞాన్దీప్ టవర్స్లో ఉంటూ.. హిందీ మిలాప్ దినపత్రికలో ప్రకటన విభాగానికి మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దిల్సుఖ్నగర్ ద్వారకాపురికి మకాం మార్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నమ్మాయి అమెరికాలో ఉండటంతో నెలక్రితం భార్యతో కలిసి అక్కడికి వెళ్లారు. తిరిగి వస్తున్నామని కుటుంబ సభ్యులు, మిత్రులకు సమాచారం ఇచ్చారు. భార్యతో గురువారం రాత్రి దిల్లీ విమానాశ్రయంలో దిగారు. హైదరాబాద్కు వచ్చేందుకు టికెట్లు కొనుగోలు చేస్తుండగా ప్రకాష్రావు హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న కుమారుడు, కుమార్తెలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శుక్రవారం దిల్లీకి వెళ్లి తండ్రి పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. వివేకానందనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. మిత్రులందరం జ్ఞాన్దీప్ టవర్స్లో సమావేశమై నివాళులర్పించామని వేల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పి.శ్రీనివాసరావు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం