డ్రైవింగ్ స్కూళ్లతో లైసెన్సులకు బ్రేక్
కార్లు నడిపేందుకు డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందినవారు ఆయా స్కూళ్ల ద్వారా లైసెన్సులు పొందే విధానాన్ని రవాణా శాఖ అధికారులు ప్రస్తుతానికి నిలిపివేయనున్నారు.
ఈనాడు, హైదరాబాద్
కార్లు నడిపేందుకు డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందినవారు ఆయా స్కూళ్ల ద్వారా లైసెన్సులు పొందే విధానాన్ని రవాణా శాఖ అధికారులు ప్రస్తుతానికి నిలిపివేయనున్నారు. లైసెన్సుల జారీ ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి డ్రైవింగ్ స్కూళ్ల వద్ద వనరులు లేకపోవడం, గ్రేటర్ పరిధిలో సుమారు 90 కేంద్రాలకు అనుమతులు లేవని గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డ్రైవింగ్ స్కూళ్లలో తనిఖీ చేయాలని, ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిపై కేసుల నమోదు, అనుమతులను రద్దు చేయనున్నారు.
నగరంలో రెండొందలకుపైనే..
కారు నడపడం నేర్పిస్తామంటూ డ్రైవింగ్ స్కూళ్ల పేరుతో రెండుమూడు కార్లు, ఒక గది ఏర్పాటుచేసి వాటినే శిక్షణ కేంద్రాలుగా కొందరు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో అధికారికంగా 80 డ్రైవింగ్ స్కూళ్లుంటే.. అనధికారికంగా 200పైనే ఉన్నాయని రవాణాశాఖ అధికారుల అంచనా. నెల రోజుల్లో డ్రైవింగ్ నేర్పించి రూ.7వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటున్నారు. అనంతరం ఆర్టీఏ ఏజెంట్లతో డ్రైవింగ్ లైసెన్సులు సులభంగా ఇప్పిస్తున్నారు. కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు ఎక్కువ మందికి డ్రైవింగ్ నేర్పించేందుకు అదనంగా కార్లను కొంటున్నారు. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్కు అనుమతి తీసుకున్నప్పుడు ఎన్ని కార్లున్నాయో దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తులో రెండు కార్లు అని తెలిపి, మరో రెండుమూడింటిని తిప్పుతున్నారు.
మూడు సైన్బోర్డులు.. నాలుగు కుర్చీలు
గ్రేటర్లోని డ్రైవింగ్ స్కూళ్లలో 70శాతం వరకు ప్రమాణాలకు అనుగుణంగా లేవని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. మూడు సైన్బోర్డులు, నాలుగు కుర్చీలు, ఒక టేబుల్ ఉంటే చాలన్నట్లుగా వాటి నిర్వాహకులు భావిస్తున్నారు. మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షకులకు తరగతి గదులుండాలి, వేగ పరిమితులు, ఇతర గుర్తులు వారికి గుర్తుండేలా చెప్పాలి. ఇందుకు విరుద్ధంగా నెలరెణ్నెల్లు శిక్షణ ఇచ్చి లైసెన్సు ఫీజు కంటే ఐదారు రెట్లు వసూలు చేసుకుని లైసెన్సు ఇప్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి