కొనుగోళ్లలో కొత్త దారి!
ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్ పోర్టల్లోకి ఒక్కో ఆసుపత్రి చేరుతోంది.
జెమ్ పోర్టల్లోకి ప్రభుత్వ దవాఖానాలు
ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెమ్ పోర్టల్లోకి ఒక్కో ఆసుపత్రి చేరుతోంది. ఇప్పటికే ఉస్మానియాలో కొన్నిరకాల పరికరాలు, సామగ్రిని జెమ్ పోర్టల్ ద్వారానే కొంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి గాంధీ ఆసుపత్రి చేరింది. ఫలితంగా జాతీయ స్థాయిలో నాణ్యమైన కంపెనీ సామగ్రిని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
* ప్రభుత్వ ఆసుపత్రులకు ఔషధాలు, పరికరాలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తుంది. ఔషధాల్లో 80 శాతం మేర అందుతాయి. మరో 20 శాతం సమకూర్చుకునేందుకు ఆసుపత్రులకు అవకాశం ఉంది.
* వీటితోపాటు ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రోగులకు అవసరమయ్యే పరికరాలు, శస్త్రచికిత్సల సామగ్రి కొంటుంటారు. ఏటా ఇలా రూ.కోట్లలోనే వ్యాపారం నడుస్తుంటాయి. వీటిని సమకూర్చుకునేందుకు ఇప్పటి వరకు సాధారణ టెండరు విధానం పాటిస్తున్నారు.
* ఈ విధానంలో ఎక్కువ శాతం అవకతవకలకు ఆస్కారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గుత్తేదారులు కుమ్మకై టెండర్లు దక్కించుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. ఆసుపత్రుల్లోని కొందరు అధికారులు కమీషన్ల యావలో పడి నాణ్యత గాలికి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.
మారిన విధానంతో...
* ఇలాంటి అవకతవకలను వీల్లేకుండా కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో 2016లో జెమ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది.
* ఇప్పటికే టీఎస్ఎంఎస్ఐడీసీ కొన్ని పరికరాలను ఈ పోర్టల్ ద్వారా కొంటోంది. మరికొన్నింటికి సాధారణ టెండర్లు పిలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రులు స్వయంగా కొనే పరికరాలు, మందులు ఇతర సామగ్రి కోసం ఈ జెమ్ పోర్టల్ను ఎంచుకుంటున్నాయి.
* ఈ పోర్టల్లో రకరకాల వ్యాపార సంస్థలు నమోదై ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ-టెండర్తో సమానమే.
* జాతీయ స్థాయిలో పోటీ ఉండటం వల్ల గుత్తేదారులు కుమ్మక్కయ్యే అవకాశం తక్కువ. ఎక్కువ కంపెనీలు ఉండటంతో నాణ్యత ఉన్న వస్తువులు.. తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గాంధీలో ఇక నుంచి జెమ్ పోర్టల్లో కొనుగోలు చేయనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, గాంధీ ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
[ 20-04-2024]
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.